ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు తాజాగా నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారి కోడలు.. నారా బ్రాహ్మణి కొత్తింట్లో పాలు పొంగించి.. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కాకుండా.. ప్రైవేటుగానే నిర్వహించారు. దీంతో మీడియాను ఎలో చేయలేదు.
ఇక, ఈ నూతన ఇంటి విషయానికి వస్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం.. కుప్పంలోని శాంతిపురం మండలం, శివపురం వద్ద నిర్మించుకున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబును ఎద్దేవా చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నుంచి విజయం దక్కించుకుంటున్నా.. కనీసం సొంత ఇల్లు అంటూ లేదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా భూమి ఎంపిక చేసి.. నూతన ఇంటి నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. 2023లో శంకు స్థాపన జరిగిన ఈ ఇంటి నిర్మాణం.. వడివడిగా సాగింది. పార్టీ కార్యాలయాన్ని.. పార్కింగ్ ఏరియాను కలుపుకోని భారీ రేంజ్లోనే ఈ నివాసాన్ని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయలకు వెచ్చించినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆదివారం ఉదయం చంద్రబాబు దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, నారా వారి కోడలు.. బ్రాహ్మణి.. నూతన గృహంలో పాలు పొంగించారు. అయితే.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలను ఆహ్వానించారు. ఎక్కడికక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. నారా లోకేష్ దంపతులు కూడా ఈ పూజల్లో కూర్చున్నారు.
This post was last modified on May 25, 2025 2:00 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…