Political News

భారత్ లో ఆపిల్‌.. ఈసారి సుంకం హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఆపిల్‌పై మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇతర దేశాల్లో తయారు చేయడం తాము సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నందుకు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు తన అభిప్రాయం చెప్పినట్లు తెలిపారు.

అలాగే ఆపిల్ కూడా ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. భారత్ లో ఎప్పటిలానే తన ప్రణాళికలు కొనసాగిస్తున్న క్రమంలో ట్రంప్ మరోసారి దూకుడు పెంచారు. ‘‘అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారవ్వాలి. మీరు భారత్‌లో తయారు చేస్తే కనీసం 25 శాతం సుంకం చెల్లించాలి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఆపిల్ షేర్లు 3% వరకు పడిపోయాయి. 

ఇదే సమయంలో భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్న ఆపిల్‌కు ఇది ఊహించని షాక్‌గా మారింది. ట్రంప్ వ్యాఖ్యలకు నేపథ్యం ఉంది. గతంలో ఆయన చైనాపై భారీ టారిఫ్‌లు విధించడంతో, ఆపిల్ సరఫరా వ్యవస్థను భారత్‌ వంటి దేశాలకు మార్చడం ప్రారంభించింది. ఫాక్స్‌కాన్, టాటా గ్రూప్, పెగాట్రాన్ వంటి కంపెనీలు తమిళనాడులో భారీగా ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్నాయి. 2023-24లో మాత్రమే భారత్‌లో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఆపిల్ తయారు చేసింది.

అయితే ఇప్పుడు ట్రంప్ తిరిగి ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘నాకు భారత్‌లో తయారీ ఇష్టం లేదు. ఇది అమెరికా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలోనే ఉత్పత్తి జరగాలి’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. తమ మధ్య చర్చల అనంతరం టిమ్ కుక్ కూడా అమెరికాలో ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికలు ఆపిల్ వ్యూహాల్లో మార్పుకు దారి తీసే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారత్‌ను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ఆపిల్‌కు ఇది పెద్ద సవాలుగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ట్రంప్ ఒత్తిడికి ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

This post was last modified on May 23, 2025 10:39 pm

Share

Recent Posts

కూతురికి ప్లాపొచ్చినా తల్లికి హిట్టు దక్కింది

గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…

39 minutes ago

సంక్రాంతికి అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…

2 hours ago

‘విక్రమ్ వేద’ డైరెక్టర్లు… ఆగిన చిరు సినిమాలో

గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ..…

2 hours ago

విశాల్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాల్ అంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి,…

3 hours ago

డిసి 100 కోట్ల లక్ష్యానికి విశ్వనాథ్ బ్రేక్ ?

గత వారం విడుదలైన డిసికి ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత ఫాలోయింగ్…

4 hours ago

ఆగస్ట్ 15 మిలమిల… థియేటర్లు కళకళ

నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…

4 hours ago