Political News

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో..: కేంద్రానికి ప‌వ‌న్ లేఖ‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా గురువారం రాత్రి కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన విష‌యాల‌ను ఆయ‌న ఎక్స్‌లో పంచుకున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వం లో రాష్ట్రం వ‌డివ‌డిగా అభివృద్ధి బాట ప‌డుతోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం స‌హకారంతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ల‌ల‌న్ సింగ్‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్నామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే.. ప్ర‌తి గ్రామానికి, ప్ర‌తి ప‌ల్లెకు, ప్ర‌తి ఒక్క‌రికి చేరువ కావ‌డ‌మేన‌ని, దానినే నిజ‌మైన అభివృద్ధి అంటార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు అదే చేస్తోంద‌ని తెలిపారు. ముఖ్యంగా మ‌హాత్మా గాంధీ ఆద‌ర్శాల మేర‌కుగ్రామ స్వ‌రాజ్య‌ సాధ‌న‌కు నిజ‌మైన అంకిత భావంతో ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. గ్రామీణ భార‌త్ మ‌హోత్స‌వ్ పేరిట ప్ర‌ధాని మోడీ చేస్తున్న ప‌నులు దేశంలో గ్రామీణుల‌కు మేలు చేస్తున్నాయ‌ని కొనియాడారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చొర‌వ‌, ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కుప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇవ‌న్నీ.. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని పేర్కొన్నారు. గ్రామ స‌భ‌, ప‌ల్లె పండుగ‌, అడ‌వి త‌ల్లి బాట వంటివి చేప‌ట్ట‌డం ద్వారా గ్రామీణుల జీవితాల్లో స‌రికొత్త మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా చేప‌ట్టిన మ‌న ఊరు.. మాటా మంతి కార్య‌క్ర‌మం ద్వారా గ్రామీణుల‌కు మ‌రింత భ‌రోసా క‌ల్పించే ఘ‌ట్టాన్ని చేప‌ట్టామ‌న్నారు.

కాగా.. గురువారం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటా-మంతి పేరుతో వెండితెర వేదిక‌గా .. అనే క్యాప్ష‌న్‌తో గ్రామీణుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావి వ‌ల‌స గ్రామ ప్ర‌జ‌ల‌తో ఓ సినిమా హాలులో ఆయ‌న ఇంట‌రాక్ట్ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పించారు. వారి నుంచి విన‌తుల‌ను కూడా స్వీక‌రించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కేంద్రానికి లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 23, 2025 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

34 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

2 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago