Political News

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు క్లాస్‌.. రీజ‌నేంటి ..!

మంత్రివ‌ర్గంలోని కొంద‌రికి మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కొల్లు ర‌వీంద్ర‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, సుభాష్, స‌విత‌, కొండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్, అనిత‌ల‌ వంటి కొంద‌రిని ప్ర‌త్యేకంగా త‌న ఛాంబ‌ర్‌లోకి పిలిచి వారితో మాట్లాడిన‌ట్టు తాజాగా తెలిసింది. ప‌నితీరుపై ఆయ‌న స‌మీక్షించార‌ని.. కొన్ని విష‌యాల్లో మంత్రుల వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారని స‌మాచారం.

ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో మంత్రుల ప‌నితీరు బాగోలేద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలోనూ.. కూట‌మి నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ మంత్రులు వెనుక‌బ‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో తాను చేయించిన స‌ర్వేల తాలూకు నివేదిక‌ల‌ను కూడా ఆయ‌న వారి ముందు పెట్టార‌ని తెలిసింది. ఆయా నివేదిక‌ల ఆధారంగా మంత్రుల‌ను కొన్నిప్ర‌శ్న‌లు కూడా అడిగిన‌ట్టు సీఎంవో వ్య‌వ‌హారాలు చూసే కీలక నాయ‌కుడు ఒక‌రు చెప్పుకొచ్చారు.

‘దీనిని క్లాస్ అని అన‌లేం కానీ.. సీఎం గ‌ట్టిగానే చెప్పారు. మంత్రుల ప‌నితీరు మార్చుకోవాలని మాత్రం చెప్పారు. ఇది వాస్త‌వ‌మే’ అని స‌ద‌రు నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రులు అనూహ్యంగా బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చారు. జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. బుధ‌వారం అనూహ్యంగా ఇంత మంది మంత్రులు మీడియా ముందుకు రావ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది.

నిజానికి చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే ప‌లుమార్లు మంత్రుల‌కు క్లాస్ ఇచ్చారు. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. పార్టీ కార్య‌క్రమాల‌కు హాజ‌రు కావాలని కూడా చెప్పుకొచ్చారు. దీంతో అప్ప‌ట్లో కొంద‌రు స్పందించారు. పార్టీ నాయకులతో క‌లివిడిగా ఉన్నారు. కానీ.. ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రుల‌కు ఉన్న కార్య‌క్ర‌మాల వ‌ల్ల కావొచ్చు.. లేదా, ఇత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నారు. దీనిపైనే చంద్ర‌బాబు ప‌లుమార్లు హెచ్చ‌రించా రు. అయిన‌ప్ప‌టికీ.. మార్పు క‌నిపించ‌డం లేద‌న్న‌ది చంద్ర‌బాబు వాద‌న‌. ఈ క్ర‌మంలోనే మంత్రుల‌కు క్లాస్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా మార్పు క‌నిపిస్తుందేమో చూడాలి.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago