ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నట్టుగానే వ్యవహరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మి కుల సమస్యలను పరిష్కరించకపోయినా.. తొలగించిన 2 వేల మంది ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోయినా.. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని.. రెండు రోజలు కిందట ఆమె ప్రకటించారు. అయితే.. ఆమె ప్రకటనను అందరూ లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ.. విశాఖ ఉక్కు యాజమాన్యానికి కానీ.. ఆమె ప్రకటన అర్ధం కానట్టుంది.
దీంతో ఎవరూ షర్మిల ప్రకటనపై స్పందించలేదు. దీంతో రెండు రోజులు గడిచినా.. విశాఖ ఉక్కు కర్మాగా రంకార్మికుల విషయంలో ఎవరూ రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రకటించినట్టు షర్మిల.. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంగణానికి ముందు.. ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. తను ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తోందో .. ఆమె ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. అయితే.. ఈ కార్యక్రమంలో కూడా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరూ పాల్గొనక పోవడం గమనార్హం. మరి షర్మిల దీక్ష ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
ఏం జరిగింది?
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై ఎవరూ స్పందించకపోవడం అన్నట్టుగానే ఆమె దీక్షకు కూర్చున్నారు.
ఇవీ షర్మిల డిమాండ్లు..
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…