ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నట్టుగానే వ్యవహరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మి కుల సమస్యలను పరిష్కరించకపోయినా.. తొలగించిన 2 వేల మంది ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోయినా.. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని.. రెండు రోజలు కిందట ఆమె ప్రకటించారు. అయితే.. ఆమె ప్రకటనను అందరూ లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ.. విశాఖ ఉక్కు యాజమాన్యానికి కానీ.. ఆమె ప్రకటన అర్ధం కానట్టుంది.
దీంతో ఎవరూ షర్మిల ప్రకటనపై స్పందించలేదు. దీంతో రెండు రోజులు గడిచినా.. విశాఖ ఉక్కు కర్మాగా రంకార్మికుల విషయంలో ఎవరూ రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రకటించినట్టు షర్మిల.. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంగణానికి ముందు.. ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. తను ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తోందో .. ఆమె ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. అయితే.. ఈ కార్యక్రమంలో కూడా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరూ పాల్గొనక పోవడం గమనార్హం. మరి షర్మిల దీక్ష ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
ఏం జరిగింది?
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై ఎవరూ స్పందించకపోవడం అన్నట్టుగానే ఆమె దీక్షకు కూర్చున్నారు.
ఇవీ షర్మిల డిమాండ్లు..
This post was last modified on May 21, 2025 6:37 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…