గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్లో జనసేన తొలిసారి విజయం దక్కించుకుంది. ఇటీవల వైసీపీ మేయర్ను గద్దెదించిన కూటమి నాయకులు.. ఈ కార్పొరేషన్లో జెండా ఎగురేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ మేయర్ పదవిని టీడీపీ దక్కించుకోగా.. డిప్యూటీ మేయర్ పదవిని జనసేన కైవసం చేసుకుంది. వాస్తవానికి సోమవారమే దీనిని పూర్తి చేయాల్సి ఉన్నా.. సొంత పార్టీ నాయకుల్లోనే విభేదాలు తలెత్తాయి. దీంతో కొందరు కార్పొరేటర్లు .. డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉండిపోయారు.
దీనికి కారణం.. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. డిప్యూటీ మేయర్గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేయడమే. ముఖ్యంగా జనసేనలో కొందరు నాయకులు పవన్ ఎంపికను తప్పుబట్టారు. కానీ.. పవన్ మాత్రం దల్లి గోవింద రెడ్డికే మొగ్గు చూపారు. ఆయన పేరునే డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక చేసి సీల్డ్ కవర్లో పంపించారు. అయితే.. ముందుగానే ఈ పేరు బయటకు తెలిసిపోవడంతో కొంత మంది అలిగి సోమవారం నిర్వహించిన సమావేశానికి రాలేదు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్.. మంగళవారం తెల్లవారు జాము నుంచే పార్టీనాయకులతో మాట్లాడి.. వారిని లైన్లో పెట్టారు. ఫలితంగా దల్లి గోవిందరెడ్డి ఎన్నిక సునాయాసంగా మారింది. దీంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని జనసేన కైవసం చేసుకున్నట్టయింది. 64వ డివిజన్కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్రెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…