Political News

విశాఖ న‌గ‌రంపై జ‌న‌సేన తొలి విజ‌యం!

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో జ‌న‌సేన తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ఇటీవ‌ల వైసీపీ మేయ‌ర్‌ను గ‌ద్దెదించిన కూట‌మి నాయకులు.. ఈ కార్పొరేష‌న్‌లో జెండా ఎగురేశారు. ఈ నేప‌థ్యంలో కార్పొరేష‌న్ మేయ‌ర్‌ ప‌ద‌విని టీడీపీ ద‌క్కించుకోగా.. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. వాస్త‌వానికి సోమ‌వార‌మే దీనిని పూర్తి చేయాల్సి ఉన్నా.. సొంత పార్టీ నాయ‌కుల్లోనే విభేదాలు త‌లెత్తాయి. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు .. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు దూరంగా ఉండిపోయారు.

దీనికి కార‌ణం.. ఉప ముఖ్య‌మంత్రి, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. డిప్యూటీ మేయ‌ర్‌గా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని ఎంపిక చేయ‌డ‌మే. ముఖ్యంగా జ‌న‌సేన‌లో కొంద‌రు నాయ‌కులు ప‌వ‌న్ ఎంపిక‌ను త‌ప్పుబ‌ట్టారు. కానీ.. ప‌వ‌న్ మాత్రం ద‌ల్లి గోవింద రెడ్డికే మొగ్గు చూపారు. ఆయ‌న పేరునే డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వికి ఎంపిక చేసి సీల్డ్ క‌వ‌ర్‌లో పంపించారు. అయితే.. ముందుగానే ఈ పేరు బ‌య‌టకు తెలిసిపోవ‌డంతో కొంత మంది అలిగి సోమ‌వారం నిర్వ‌హించిన స‌మావేశానికి రాలేదు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జాము నుంచే పార్టీనాయ‌కుల‌తో మాట్లాడి.. వారిని లైన్‌లో పెట్టారు. ఫ‌లితంగా ద‌ల్లి గోవింద‌రెడ్డి ఎన్నిక సునాయాసంగా మారింది. దీంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ పీఠాన్ని జ‌న‌సేన కైవసం చేసుకున్న‌ట్ట‌యింది. 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్‌ దల్లి గోవింద్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యులు ఆయ‌న‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

This post was last modified on May 21, 2025 5:09 pm

Share

Recent Posts

బోయపాటికి ఎస్ చెప్పే హీరో ఎవరు

అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…

55 minutes ago

పిఠాపురం ఆడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ రాఖీలు!

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక అనుబంధాన్ని…

1 hour ago

సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…

1 hour ago

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

2 hours ago

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

4 hours ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

4 hours ago