టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై 20 ఏళ్ల క్రితం తిరుపతి సమీపంలోని అలిపిరిలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. మనం ఇప్పుడు మావోయిస్టులుగా పిలుచుకుంటున్న నాటి నక్సలైట్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అప్పటికే 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బాబు… ఆ తర్వాత అప్రహతిహాతంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి మరోమారు సీఎంగా పనిచేస్తున్నారు.
నాడు కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళుతున్న చంద్రబాబుపై నక్సలైట్లు క్లెమోర్ మైన్లు పెట్టి పేల్చారు. ఈ దాడికి నాటి నక్సల్స్ ఉద్యమంలో గెరిల్లా పోరాటానికి నాందీ పలికిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న తాజాగా బుధవారం ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైపోయాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల… వరంగల్ లోని ఇప్పటి ఎన్ఐటీ… నాటి ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివి ఆ తర్వాత నేరుగా నక్సల్స్ ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంట్రీ ఇవ్వడంతోనే గెరిల్లా పోరాటాలకు తెర లేపిన నంబాల కీలక రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సాగాడు.
దండకారణ్యంలో కీలక భూమిక పోషించిన నంబాల… మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మావోయిస్టులను సమూలంగా ఏరివేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే మావోయిస్టులకు పెద్ద ఎత్తున దెబ్బలు తగలగా…తాజాగా బుధవారం చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో నంబాల కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
చంద్రబాబుపై హత్యాయత్నంతో పాటుగా బలిమెల వంటి కీలక ఆపరేషన్లు కూడా నంబాల నేతృత్వంలోనే జరిగినట్లు సమాచారం. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖ జిల్లా పరిధిలో నాటి టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమలను కూడా మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యలకు కూడా నంబాలనే వ్యూహకర్తగా వ్యవహరించారట. మావోయిస్టుల ప్రస్థానంలో కీలక భూమిక పోషించడంతో పాటుగా నక్సల్స్ పేరును మావోయిస్టులుగా మార్చే ప్రక్రియలోనూ నంబాలది కీలక భూమికే. నంబాలపై రూ.1.5 కోట్ల మేర రివార్డు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
This post was last modified on May 21, 2025 12:37 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…