ఏపీలో ఏడాది క్రితం ప్రభుత్వం మారిపోయింది. అప్పటిదాకా బలంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగా… అప్పటిదాకా బొటాబోటీ సభ్యులున్న కూటమి రికార్డు విక్టరీ కొట్టి కాలర్ ఎగరేసిందనే చెప్పాలి. కూటమి సారథిగా ఉన్న టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత దాదాపుగా అన్ని స్థాయిల్లోనూ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇలాంటి క్రమంలో మంగళవారం అటు జనసేనకు ఫుల్ జోష్, వైసీపీకి ఓ మోస్తరు హుషారు తీసుకొచ్చే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో మొన్నటిదాకా వైసీపీ అధికార పార్టీగా కొనసాగగా… ఇటీవలే జరిగిన పరిణామాలతో ఆ అధికారం కూటమికి దక్కింది. టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ గా పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం దక్కగా… జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీకి చెందిన గోవింద రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేశారు. అయితే కూటమి పార్టీల మద్య అవగాహన లేమితో సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడగా…మంగళవారం మాత్రం ఏకగ్రీవంగానే గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డిని అభినందిస్తూ పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే..జీవీఎంసీకి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ మంగళవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. మంగళవారం తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాగా…పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ సౌత్ నియోజకవర్గ ఇంచార్జీ వాసుపల్లి గణేశ్ లతో కలిసి వచ్చిన 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. పూర్ణిమకు స్వయంగా జగనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెరసి మంగళవారం జీవీఎంసీలో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కగా.. గుడ్డిలో మెల్ల మాదిరిగా టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ చేరడంతో వైసీపీ కూడా ఒకింత సంబరపడింది.
This post was last modified on May 21, 2025 11:17 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…