వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు జైలు అధికారులు మళ్లీ అదే జైలును, అదే గదిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావడం తెలిసిందే. టీడీపీ నాయకుడిపై చేయి చేసుకున్నారన్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.
ఈ క్రమంలో వచ్చే 2వ తేదీ(14 రోజులు) వరకు కోర్టు నందిగంకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీ సులు ఆయనను జైలుకు తరలించనున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గతంలో ఓ ఎస్సీ మహిళ హత్య కేసులో నందిగం అరెస్టయిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ హత్య జరిగిన క్రమంలో ఆమె కుటుంబం ఫిర్యాదు మేరకు.. నందిగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో నందిగంను… గుంటూరు జైలుకు తరలించారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉన్న నందిగం ఎట్టకేలకు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్త.. ఒకరు తన ఇంటి ముందు గలాభా చేశారని ఆరోపిస్తూ.. సదరు కార్యకర్తను నందిగం ఆయన అనుచరులు చితక్కొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తాజాగా నమోదైన కేసులో నందిగంను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
ఈ క్రమంలో 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అదే పాత జైలుకు తరలించేందుకు..అదే పాత బ్యారెక్(గది)ను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత.. అన్న సామెత వైసీపీనాయకుల విషయంలో స్పష్టమవుతోంది.
This post was last modified on May 19, 2025 12:59 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…