వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు జైలు అధికారులు మళ్లీ అదే జైలును, అదే గదిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావడం తెలిసిందే. టీడీపీ నాయకుడిపై చేయి చేసుకున్నారన్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.
ఈ క్రమంలో వచ్చే 2వ తేదీ(14 రోజులు) వరకు కోర్టు నందిగంకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీ సులు ఆయనను జైలుకు తరలించనున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గతంలో ఓ ఎస్సీ మహిళ హత్య కేసులో నందిగం అరెస్టయిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ హత్య జరిగిన క్రమంలో ఆమె కుటుంబం ఫిర్యాదు మేరకు.. నందిగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో నందిగంను… గుంటూరు జైలుకు తరలించారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉన్న నందిగం ఎట్టకేలకు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్త.. ఒకరు తన ఇంటి ముందు గలాభా చేశారని ఆరోపిస్తూ.. సదరు కార్యకర్తను నందిగం ఆయన అనుచరులు చితక్కొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తాజాగా నమోదైన కేసులో నందిగంను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
ఈ క్రమంలో 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అదే పాత జైలుకు తరలించేందుకు..అదే పాత బ్యారెక్(గది)ను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత.. అన్న సామెత వైసీపీనాయకుల విషయంలో స్పష్టమవుతోంది.
This post was last modified on May 19, 2025 12:59 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…