Political News

కాంగ్రెస్ వద్దంటే మాత్రం థరూర్ కు అర్హత లేదా?

ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నియమితులు అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన అనుమతి లేకుండా తన పార్టీ ఎంపీని అఖిల పక్షానికి ఎలా నేతృత్వం వహించమని చెబుతారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా రాజకీయాలేల అంటూ కాంగ్రెస్ కామెంట్లకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

పహల్ గాం ఉగ్రదాడి, అందులో మరణించిన భారతీయులు, దాడిలో ఉగ్రవాదులు అనుసరించిన దారుణ ప్రణాళిక, ఉగ్రవాదులకు పాకిస్తాన్ నేరుగా సాయం అందించిన తీరు, ఆ దాడికి ప్రతిగానే పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసుకుని జరిపిన ఆపరేషన్ సిందూర్, అందులో చనిపోయిన ఉగ్రవాదులు, పాక్ లోని జనావాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లని వైనం, అప్పటికీ పాక్ దుందుడుకు వైఖరి..తదితరాలను ప్రపంచదేశాలకు వివరించాలని నరేంద్ర మోదీ సర్కారు తీర్మానించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది.

ఈ అఖిల పక్షంలోకి తన పార్టీ నుంచి ఆనంధ్ శర్మ, గౌవర్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ నలుగురిని పక్కనపెట్టిన మోదీ సర్కారు.. శశి థరూర్ ను ఎంపిక చేసింది. అంతేకాకుండా అఖిల పక్షానికి నేతృత్వం వహించాలని కూడా థరూర్ ను కేంద్రం కోరింది. అందుకు థరూర్ కూడా ఓకే అన్నట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ తనదైన శైలి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన పార్టీకి చెందిన నేతలను బీజేపీ లాగేసుకుంటోందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా… శశి థరూర్ కు అఖిలపక్షానికి నేతృత్వం వహించే అర్హత లేదా? అంటే… ఆ మాటకొస్తే.. ఆ బాధ్యతను థరూర్ కంటే మెరుగైన రీతిలో నిర్వర్తించే వారే లేరని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే… రాజకీయాల్లోకి రాకముందు థరూర్ ఐక్యరాజ్యసమితిలో ఏళ్ల తరబడి పనిచేశారు. ఐరాస అంటేనే ప్రపంచ శాంతిని కాంక్షించే సంస్థ కదా. అలాంటి సంస్థలో ఏళ్ల తరబడి పనిచేయడమంటే… దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ ఆయనకు ఉన్నంత సత్సంబంధాలు మరెవరికీ ఉండవని కూడా చెప్పొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై థరూర్ కున్న అవగాహన అమోఘమనే చెప్పాలి.

ఈ కారణంగానే కదా…ఐరాసలో ఉద్యోగాన్ని వదిలి భారత్ కు రాగానే… కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. థరూర్ అడగకుండానే ఎంపీ టికెట్ ఇచ్చి…ఆయనను గెలిపించుకుని మరీ ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్సే కదా. ఆ తర్వాత థరూర్ పై చాలా వివాదాలు వచ్చినా. అవన్నీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవే తప్పించి… దేశ భద్రతకు గానీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించేవి కాదు కదా. ఈ లెక్కన కాంగ్రెస్ వద్దన్నా కూడా అఖిలపక్షానికి థరూర్ నేతృత్వం సరైన నిర్ణయం అని చెప్పక తప్పదు.

This post was last modified on May 17, 2025 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago