Political News

కాంగ్రెస్ వద్దంటే మాత్రం థరూర్ కు అర్హత లేదా?

ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నియమితులు అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన అనుమతి లేకుండా తన పార్టీ ఎంపీని అఖిల పక్షానికి ఎలా నేతృత్వం వహించమని చెబుతారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా రాజకీయాలేల అంటూ కాంగ్రెస్ కామెంట్లకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

పహల్ గాం ఉగ్రదాడి, అందులో మరణించిన భారతీయులు, దాడిలో ఉగ్రవాదులు అనుసరించిన దారుణ ప్రణాళిక, ఉగ్రవాదులకు పాకిస్తాన్ నేరుగా సాయం అందించిన తీరు, ఆ దాడికి ప్రతిగానే పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసుకుని జరిపిన ఆపరేషన్ సిందూర్, అందులో చనిపోయిన ఉగ్రవాదులు, పాక్ లోని జనావాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లని వైనం, అప్పటికీ పాక్ దుందుడుకు వైఖరి..తదితరాలను ప్రపంచదేశాలకు వివరించాలని నరేంద్ర మోదీ సర్కారు తీర్మానించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది.

ఈ అఖిల పక్షంలోకి తన పార్టీ నుంచి ఆనంధ్ శర్మ, గౌవర్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ నలుగురిని పక్కనపెట్టిన మోదీ సర్కారు.. శశి థరూర్ ను ఎంపిక చేసింది. అంతేకాకుండా అఖిల పక్షానికి నేతృత్వం వహించాలని కూడా థరూర్ ను కేంద్రం కోరింది. అందుకు థరూర్ కూడా ఓకే అన్నట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ తనదైన శైలి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన పార్టీకి చెందిన నేతలను బీజేపీ లాగేసుకుంటోందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా… శశి థరూర్ కు అఖిలపక్షానికి నేతృత్వం వహించే అర్హత లేదా? అంటే… ఆ మాటకొస్తే.. ఆ బాధ్యతను థరూర్ కంటే మెరుగైన రీతిలో నిర్వర్తించే వారే లేరని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే… రాజకీయాల్లోకి రాకముందు థరూర్ ఐక్యరాజ్యసమితిలో ఏళ్ల తరబడి పనిచేశారు. ఐరాస అంటేనే ప్రపంచ శాంతిని కాంక్షించే సంస్థ కదా. అలాంటి సంస్థలో ఏళ్ల తరబడి పనిచేయడమంటే… దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ ఆయనకు ఉన్నంత సత్సంబంధాలు మరెవరికీ ఉండవని కూడా చెప్పొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై థరూర్ కున్న అవగాహన అమోఘమనే చెప్పాలి.

ఈ కారణంగానే కదా…ఐరాసలో ఉద్యోగాన్ని వదిలి భారత్ కు రాగానే… కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. థరూర్ అడగకుండానే ఎంపీ టికెట్ ఇచ్చి…ఆయనను గెలిపించుకుని మరీ ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్సే కదా. ఆ తర్వాత థరూర్ పై చాలా వివాదాలు వచ్చినా. అవన్నీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవే తప్పించి… దేశ భద్రతకు గానీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించేవి కాదు కదా. ఈ లెక్కన కాంగ్రెస్ వద్దన్నా కూడా అఖిలపక్షానికి థరూర్ నేతృత్వం సరైన నిర్ణయం అని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

4 minutes ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

36 minutes ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

52 minutes ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

1 hour ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

2 hours ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

2 hours ago