Political News

బెజవాడ జైలర్ బదిలీ!.. జైల్లో ఏం జరుగుతోంది..?

విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జైలు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, బెజవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ లిక్కర్ స్కాం నిందితులు, ఏపీపీఎస్పీ అక్రమాల కేసు నిందితులు, టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసుల నిందితులు.. ఇలా అన్నీ రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసుల నిందితులు అక్కడే ఉంటున్నారు. ఉన్నట్టుండి… శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ కార్యాలయం బెజవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హంసపాల్ ను ఉన్నపళంగా బదిలీ చేసింది.

ఈ పరిణామం క్షణాల్లో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కీలక కేసులకు సంబంధించిన నిందితులు ఉంటున్న జైలు వ్యవహారాలను హంసపాల్ సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారా?.. లేదంటే ఆయా నిందితులకు ఏమైనా సహకారం అందిస్తున్నారా? అన్న కోణంలో… ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. హంసపాల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు అటాచ్ చేసిన డీజీ కార్యాలయం..అక్కడి శిక్షణా కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చింది. అదే సమయంలో హంసపాల్ స్థానంలో మహ్మద్ ఇర్ఫాన్ అనే అధికారిని నియమించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఓ సబ్ జైలుకు ఆయన సూపరింటెండెంట్ గా పనిచేస్తుండగా… పదోన్నతి ఇచ్చి మరీ ఆయనను బెజవాడకు పంపింది.

ఇతరత్రా నిందితుల విషయం ఎలా ఉన్నా వల్లభనేని వంశీ, పీఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ గతంలో బద్ధ శత్రువులుగా సాగారు. అయితే వైసీపీ అదికారంలోకి వచ్చాక… వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి చేరగా.. అప్పటికే వైసీపీకి అనుకూలంగా మారిన పీఎస్ఆర్ కు కీలక పోస్టింగులు దక్కాయి. ఈ పరిణామాలు వంశీ, పీఎస్ఆర్ ల మధ్య దూరాన్ని తగ్గించాయో, లేదో తెలియదు గానీ… వారిద్దరూ ఒకే జైలులో ఉండటంతో ఇప్పటికే బెజవాడ జిల్లా జైలుపై అందరిలోనూ ఆసక్తి ఉంది. అలాంటి సమయంలో ఉన్నపళంగా జైలు సూపరింటెడెంట్ ను బదిలీ చేయడం, ఓ తక్కువ స్థాయి అదికారికి ప్రమోషన్ ఇచ్చి మరీ బెజవాడ జైలుకు పంపడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

బెజవాడ జిల్లా జైలులో వంశీ మూడు నెలలుగా ఉంటున్నారు. తొలుత కిడ్నాప్ కేసులో అరెస్టైన ఆయనపై ఆ తర్వాత వరుసబెట్టి కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా కొన్ని కేసుల్లో బెయిల్ దక్కినా… ఆయన మాత్రం జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో అప్పటికే పలు అనారోగ్య సమస్యలు ఉన్న వంశీ.. ఇప్పుడు ఏకంగా 20కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా ఆయన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. బయటకు వచ్చినప్పుడు ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకుని దగ్గుతూ, నడవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరహా పరిస్థితికి కారణాలేమిటో తెలియదు గానీ… జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇటీవలే జైళ్ల శాఖ డీజీ మొహ్మద్ అహసాన్ రెజా తన రొటీన్ తనిఖీల్లో భాగంగా విజయవాడ జిల్లా జైలును సందర్శించారట. ఈ సందర్భంగా ఆయన జైలులో పలు లోటుపాట్లను గమనించినట్లు సమాచారం. అయితే వాటిపై తనిఖీల సందర్భంగా ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయిన డీజీ.. హఠాత్తుగా శుక్రవారం రాత్రి విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేయడం ప్రాదాన్యం సంతరించుకుంది. ఈ లెక్కన జైలులో జరుగుతున్న విషయాలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే హంసపాల్ బదిలీపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కీలక కేసుల నిందితులు ఉన్న బెజవాడ జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీ మాత్రం అందరిని విస్మయానికి గురి చేసింది.

This post was last modified on May 17, 2025 12:50 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

4 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

4 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

11 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

11 hours ago