Political News

క‌డ‌ప‌-మాచ‌ర్ల‌.. ఒకేసారి వైసీపీకి రెండు దెబ్బ‌లు!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. రెండు స్థానిక సంస్థ‌లు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. వీటిలో ఒక‌టి.. ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల మునిసిపాలిటీ కాగా.. రెండోది వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌. ఈ రెండు మునిసిపాలిటీల చైర్మ‌న్‌ల‌పై కూట‌మి స‌ర్కారు బుధ‌వారం ఒక్క‌సారే వేటు వేసింది. వీటిలో ఒక‌రు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం కార‌ణ‌మైతే.. మ‌రొక‌రు అవినీతి పాల్ప‌డ్డార‌న్న అభియోగాలు ఉండ‌డ‌మే కార‌ణం. దీంతో ఇద్ద‌రినీ కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది. ఇది వైసీపీకి భారీ ఎదురు దెబ్బేన‌ని అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు.

ప‌ల్నాడులో..

ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల మునిసిపాలిటీలో 2021-22 మ‌ధ్య జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అండ‌తో వైసీపీ విజ‌యం దక్కించుకుంది. ఈ క్ర‌మంలోనే పిన్నెల్లి అనుచ‌రుడిగా పేరున్న కిషోర్‌కుమార్‌ను మాచ‌ర్ల మునిసిపాలిటీ చైర్మ‌న్ చేశారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై దృష్టి పెట్టింది. ఛైర్మన్‌ పదవి దుర్వినియోగం చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో వాటిపై విచార‌ణకు ఆదేశించింది.

ఈ క్ర‌మంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో విచార‌ణ జ‌రిపి.. ప్ర‌బుత్వానికి నివేదిక అందించారు. అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్‌ భేటీలకు కిషోర్ కుమార్ ఎగ్గొట్టార‌ని, ఇది మునిసిప‌ల్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 16(1)ని తోసిపుచ్చ‌డ‌మేన‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. దీంతో స‌ర్కారు ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఆ వెంట‌నే ముఖ్య‌కార్య‌ద‌ర్శి.. చైర్మ‌న్ కిషోర్‌కుమార్‌ను ప‌ద‌వీచ్యుతిడిని చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

క‌డ‌ప‌లో..

క‌డ‌ప మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా ఉన్న సురేష్‌బాబు అవినీతి పాల్ప‌డ్డార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌పై విచార‌ణ‌కు విజిలెన్సును నియ‌మించిన ప్ర‌భుత్వం పూర్తి అధికారాల‌ను క‌లెక్ట‌ర్ కు అప్ప‌గించింది. కార్పొరేష‌న్‌లో ప‌నుల‌ను కాంట్రాక్టు బేసిక్‌గా ఇవ్వ‌కుండా.. త‌న కుటుంబానికి ముఖ్యంగా త‌న భార్య పేరుతో ఉన్న కాంట్రాక్టు కంపెనీకి నామినేటెడ్ ప‌ద్ద‌తిపై ఇచ్చార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో 36 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ గుర్తించారు. దీనిపై వివ‌ర‌ణ కోరుతూ.. మేయ‌ర్ సురేష్ బాబుకు ప‌లు ద‌ఫాలుగా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ సరిగా లేద‌ని గ్రహించిన ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది.

This post was last modified on May 15, 2025 12:53 pm

Share

Recent Posts

బోయపాటికి ఎస్ చెప్పే హీరో ఎవరు

అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…

56 minutes ago

పిఠాపురం ఆడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ రాఖీలు!

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక అనుబంధాన్ని…

1 hour ago

సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…

1 hour ago

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

2 hours ago

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

4 hours ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

4 hours ago