ఏపీ ప్రతిపక్షం వైసీపీ ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. రెండు స్థానిక సంస్థలు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. వీటిలో ఒకటి.. పల్నాడు జిల్లాలోని మాచర్ల మునిసిపాలిటీ కాగా.. రెండోది వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప మునిసిపల్ కార్పొరేషన్. ఈ రెండు మునిసిపాలిటీల చైర్మన్లపై కూటమి సర్కారు బుధవారం ఒక్కసారే వేటు వేసింది. వీటిలో ఒకరు నిబంధనలు పాటించకపోవడం కారణమైతే.. మరొకరు అవినీతి పాల్పడ్డారన్న అభియోగాలు ఉండడమే కారణం. దీంతో ఇద్దరినీ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇది వైసీపీకి భారీ ఎదురు దెబ్బేనని అంటున్నారు ఆ పార్టీ నాయకులు.
పల్నాడులో..
పల్నాడు జిల్లాలోని మాచర్ల మునిసిపాలిటీలో 2021-22 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో వైసీపీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే పిన్నెల్లి అనుచరుడిగా పేరున్న కిషోర్కుమార్ను మాచర్ల మునిసిపాలిటీ చైర్మన్ చేశారు. అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆయన వ్యవహార శైలిపై దృష్టి పెట్టింది. ఛైర్మన్ పదవి దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణకు ఆదేశించింది.
ఈ క్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో విచారణ జరిపి.. ప్రబుత్వానికి నివేదిక అందించారు. అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు కిషోర్ కుమార్ ఎగ్గొట్టారని, ఇది మునిసిపల్ చట్టంలోని సెక్షన్ 16(1)ని తోసిపుచ్చడమేనని నివేదికలో పేర్కొన్నారు. దీంతో సర్కారు ఆయనపై చర్యలకు ఆదేశించింది. ఆ వెంటనే ముఖ్యకార్యదర్శి.. చైర్మన్ కిషోర్కుమార్ను పదవీచ్యుతిడిని చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కడపలో..
కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న సురేష్బాబు అవినీతి పాల్పడ్డారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై విచారణకు విజిలెన్సును నియమించిన ప్రభుత్వం పూర్తి అధికారాలను కలెక్టర్ కు అప్పగించింది. కార్పొరేషన్లో పనులను కాంట్రాక్టు బేసిక్గా ఇవ్వకుండా.. తన కుటుంబానికి ముఖ్యంగా తన భార్య పేరుతో ఉన్న కాంట్రాక్టు కంపెనీకి నామినేటెడ్ పద్దతిపై ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో 36 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని కలెక్టర్ గుర్తించారు. దీనిపై వివరణ కోరుతూ.. మేయర్ సురేష్ బాబుకు పలు దఫాలుగా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేదని గ్రహించిన ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on May 15, 2025 12:53 pm
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…