Political News

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన దేశాలపై భారతీయులు తమ స్థాయిలో గట్టిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలు పాక్ కు మద్దతు ఇవ్వగా ఇప్పుడు భారతీయుల నుంచి తీవ్ర ప్రభావం ఎదురవుతోంది.

ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్ళాలి అనుకున్న భారతీయులు తమ బుకింగ్‌లను వాపసు తీసుకుంటున్నారు. ప్రేమపూర్వకంగా వెళ్లే విందు పర్యటనలు ఇప్పుడు ఆగ్రహంతో మారిపోతున్నాయి. ప్రముఖ ట్రావెల్ సంస్థలు మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క వారం వ్యవధిలో టర్కీకి బుకింగ్‌లు 60 శాతం తగ్గినట్టు, క్యాన్సిలేషన్లు 250 శాతం పెరిగినట్టు సమాచారం. దేశ భద్రతను గౌరవిస్తూ ఈ రెండు దేశాలకు ఉన్న ప్రమోషనల్ ఆఫర్లను నిలిపివేశామని మేక్‌మైట్రిప్ అధికారికంగా ప్రకటించింది. అజర్‌బైజాన్, టర్కీకి ఇప్పుడు ప్రయాణాలు అవసరం అయితే తప్ప, నివారించాలంటూ సూచనలు జారీ చేసింది.

ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, దేశం ముందు వ్యక్తిగత ప్రయోజనాలు చిన్నవని తెలిపారు. టర్కీకి 22 శాతం, అజర్‌బైజాన్‌కు 30 శాతం టూర్ క్యాన్సిలేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. తమ సంస్థ కూడా దేశానికి నిస్వార్థంగా నిలిచే ప్రతి పౌరుడికి తోడుగా ఉండబోతుందని చెప్పారు.

2024లో టర్కీ, అజర్‌బైజాన్‌లను కలిపి సుమారు 6 లక్షల మంది భారతీయులు సందర్శించారు. ఈ మొత్తానికి తగ్గట్టుగా వేల కోట్ల రూపాయల విదేశీ ఆదాయం ఆ దేశాలకు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే, టర్కీ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం ఉండడం ఖాయం. భారత్ వైఖరితో మిత్రదేశాలు జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.

This post was last modified on May 14, 2025 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago