వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి శకునం ఏమీ బాగా లేనట్లు ఉంది. ఎందుకంటే… బుధవారం ఒక్కరోజే ఆయనకు ఏకంగా రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. అవి కూడా తన సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోనే జరగడం నిజంగానే జగన్ కు డబుల్ స్ట్రోక్స్ అనే చెప్పాలి. త్వరలో టీడీపీ మహానాడు కడపలోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా పరిణామాలను చూస్తుంటే… కడపలో జగన్ తన పార్టీని కాపాడుకోగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం మధ్యాహ్నం కడప నగర పాలక సంస్థ మేయర్ గా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత, జగన్ అనుంగుడు సురేశ్ బాబు తన పదవిని కోల్పోయారు. ఈ మేరకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సురేశ్ బాబుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రాగా… అవి తప్పని నిరూపించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత కొంతకాలం క్రితం ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి.
అయితే ఈ నోటీసులు రాజకీయ దురుద్దేశ్యంతో జారీ అయ్యాయని సురేశ్ బాబు ఆరోపించారు. అంతేకాకుండా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి విజయ పతాక ఎగురవేసిన రెడ్డప్పగారి మాధవి రెడ్డి ప్రోద్బలం మేరకే రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షపూరితంగా నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తానేమీ అవినీతికి పాల్పడలేదన్న సురేశ్ బాబు..తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని తెలిపారు. నోటీసులకు సమాధానం ఇచ్చే గడువు మంగళవారమే ముగియడంతో ప్రభుత్వ ఉత్తర్వులను సురేశ్ బాబు ఉల్లంఘించారని ఆరోపిస్తూ మేయర్ పదవి నుంచి తొలగించింది.
ఇక ఈ స్ట్రోక్ కంటే ముందుగా మంగళవారం రాత్రే వైసీపీకి ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన మహిళా నేత, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ రాజీనామా చేశారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం ఆమె నేరుగా బీజేపీ నేతల వద్దకు వెళ్లి కమల దళంలో చేరిపోయారు. వక్ఫ్ సవరణ బిల్లు నేపథ్యంలో జగన్ కు ఈ పరిణామం ఓ రేంజి షాకిచ్చినట్టేనని చెప్పక తప్పదు. వెరసి ఒకే రోజు రెండు భారీ దెబ్బలు తగలడంతో జగన్ బుధవారం బాగా లేదనే చెప్పాలి.
This post was last modified on May 14, 2025 6:58 pm
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…