Political News

పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు పెద్ద కారణమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా చైనా అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్, పాక్ లాంటి దేశాల మధ్య ఎప్పుడూ ఒక చీకటి గీత ఉండాలని కోరుకుంటున్నాయని భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధ వేడి వల్ల ఆయుధ వ్యాపారం బుమ్ అవుతుంది, బిలియన్ల డాలర్ల వ్యాపారం ఒక్క ఘర్షణ ద్వారా తిరుగులేని లాభాలను తెచ్చిపెడుతుందనేది వారి ఆలోచన.

చైనా విషయంలో మాట్లాడుకుంటే, భారత్ ఎదుగుదలతో అసూయపడుతూ పొరుగు దేశాల విషయంలో తప్పుడు వ్యూహాలు అమలు చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పాక్‌తో ఆర్ధిక, సైనిక ఒప్పందాల పేరుతో చైనా పాక్షికంగా భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. చైనా మౌలిక సదుపాయాలను పాక్‌లో నిర్మించడం, గ్వాదర్ పోర్ట్ నుంచి వాణిజ్య మార్గాల దాకా ఆ దేశానికి మద్దతుగా నిలుస్తోంది. దీని వెనుక అసలు ఉద్దేశం భారత నియంత్రణకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్‌కి బలం చేకూర్చడమేనని నిపుణుల అభిప్రాయం.

అమెరికా విషయానికొస్తే, భారత్‌ను మిత్రదేశంగా అభివర్ణించినప్పటికీ, కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో ఆ దేశ వైఖరిలో స్పష్టత లేదు. నిజంగా భారత్‌పై అండగా ఉండాలంటే, కాశ్మీర్ విషయంలో ఓ స్పష్టమైన మద్దతు ఇచ్చి పాక్‌ను ఒత్తిడికి గురిచేయొచ్చు. కానీ అమెరికా ఆయుధ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో తటస్థంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా తరువాత పాక్ కు ఇతర ఆయుధాలు ఎక్కువగా అమెరికా నుంచే వస్తాయి కాబట్టి. భారత్ పాక్ వివాదం కొనసాగుతుంటే రెండు దేశాల నుంచి డిఫెన్స్ బిజినెస్‌కి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.

భారత ఆర్మీ దృష్టిలో చూస్తే, ఒక చిన్న ఆపరేషన్ సిందూర్‌తోనే పాక్ ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావడం దీటైన ఉదాహరణ. అంటే సమస్యను శాంతిగా లేకుండా శక్తితో కూడా పరిష్కరించగల సామర్థ్యం భారత్‌కి ఉంది. కానీ అదే సమయంలో భారత్‌కి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల మద్దతు, భద్రతా అవగాహనలు అవసరం కావడంతో, వేడి చూపిస్తూ చీకటి వ్యూహాలు వేయాల్సి వస్తోంది.

మొత్తంగా చూస్తే, పాక్‌తో తేల్చుకోవాలనుకుంటున్న భారత్‌కు అసలు అడ్డంకి తామే అయినట్లుగా అమెరికా, చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నలు పెంచుతోంది. రాజకీయంగా మద్దతిస్తున్నామంటూ చెప్పినా, వాస్తవంగా మాత్రం ఆయుధాల వ్యాపారం, వ్యూహాత్మక ప్రాధాన్యత కోసం ఘర్షణను నిలబెట్టాలని చూస్తున్నట్లు అర్ధమవుతుంది.

This post was last modified on May 14, 2025 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

19 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

31 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago