Political News

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల విడిభాగాల త‌యారీ యూనిట్‌ను తీసుకువ‌చ్చిన ఆయ‌న‌.. తాజాగా రెన్యూ ఎనర్జీ సంస్థ‌ను ఏపీకి తీసుకువ‌చ్చారు. అది కూడా.. కియా ఏర్పాటు చేసిన అనంత‌పురం జిల్లాలోనే ఇప్పుడు రెన్యూ ఎన‌ర్జీ సంస్థ‌నూత‌న ప్లాంటును ఏర్పాటు చేయ‌నుండ‌డం గ‌మ‌నార్హం. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగానికి కేంద్రం పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌ట‌ దావోస్‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ రెన్యూ ఎనర్జీస్ సంస్థ‌తో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ సంస్థ వివిధ ద‌శ‌ల్లో 22 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబడుల‌తో పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల సంస్థ‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే.. దీనిని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌న్న చ‌ర్చ కొంత ఆల‌స్య‌మైంది. ముందుగా క‌ర్నూలు అనుకున్నారు. త‌ర్వాత‌.. క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు.

అయితే.. సీమ‌కు మ‌ణిహారంగా ఉన్న అనంత‌పురంలో(జిల్లాల్లో నూ పెద్ద‌ది, వ‌న‌రులు కూడా ఉన్నాయి) ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని కంపెనీకి స‌మాచారం అందించారు. దీంతో ఈ నెల 16న రెన్యూ ఎన‌ర్జీ సంస్థ‌.. ఇక్క‌డ పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్ల పెట్టుబ‌డితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.

ఏంటి లాభం?

— తొలిదశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. త‌ద్వారా వంద‌ల సంఖ్యంలో ఉద్యోగాలు ల‌భిస్తాయి.

— రెండో ద‌శ‌లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది.

— ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. త‌ద్వారా విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఆటంకం లేని వ్య‌వ‌స్థ అందుబాటులోకి రానుంది.

— స్థానికుల‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

This post was last modified on May 14, 2025 1:48 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

47 minutes ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

2 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

2 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

4 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

4 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

6 hours ago