మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల విడిభాగాల తయారీ యూనిట్ను తీసుకువచ్చిన ఆయన.. తాజాగా రెన్యూ ఎనర్జీ సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. అది కూడా.. కియా ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థనూతన ప్లాంటును ఏర్పాటు చేయనుండడం గమనార్హం. పునరుత్పాదక ఇంధన రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట దావోస్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెన్యూ ఎనర్జీస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ సంస్థ వివిధ దశల్లో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే.. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ కొంత ఆలస్యమైంది. ముందుగా కర్నూలు అనుకున్నారు. తర్వాత.. కడపలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
అయితే.. సీమకు మణిహారంగా ఉన్న అనంతపురంలో(జిల్లాల్లో నూ పెద్దది, వనరులు కూడా ఉన్నాయి) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీకి సమాచారం అందించారు. దీంతో ఈ నెల 16న రెన్యూ ఎనర్జీ సంస్థ.. ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థను ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.
ఏంటి లాభం?
— తొలిదశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. తద్వారా వందల సంఖ్యంలో ఉద్యోగాలు లభిస్తాయి.
— రెండో దశలో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది.
— ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. తద్వారా విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఆటంకం లేని వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
— స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
This post was last modified on May 14, 2025 1:48 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…