Political News

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల విడిభాగాల త‌యారీ యూనిట్‌ను తీసుకువ‌చ్చిన ఆయ‌న‌.. తాజాగా రెన్యూ ఎనర్జీ సంస్థ‌ను ఏపీకి తీసుకువ‌చ్చారు. అది కూడా.. కియా ఏర్పాటు చేసిన అనంత‌పురం జిల్లాలోనే ఇప్పుడు రెన్యూ ఎన‌ర్జీ సంస్థ‌నూత‌న ప్లాంటును ఏర్పాటు చేయ‌నుండ‌డం గ‌మ‌నార్హం. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగానికి కేంద్రం పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌ట‌ దావోస్‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ రెన్యూ ఎనర్జీస్ సంస్థ‌తో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ సంస్థ వివిధ ద‌శ‌ల్లో 22 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబడుల‌తో పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల సంస్థ‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే.. దీనిని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌న్న చ‌ర్చ కొంత ఆల‌స్య‌మైంది. ముందుగా క‌ర్నూలు అనుకున్నారు. త‌ర్వాత‌.. క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు.

అయితే.. సీమ‌కు మ‌ణిహారంగా ఉన్న అనంత‌పురంలో(జిల్లాల్లో నూ పెద్ద‌ది, వ‌న‌రులు కూడా ఉన్నాయి) ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని కంపెనీకి స‌మాచారం అందించారు. దీంతో ఈ నెల 16న రెన్యూ ఎన‌ర్జీ సంస్థ‌.. ఇక్క‌డ పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్ల పెట్టుబ‌డితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.

ఏంటి లాభం?

— తొలిదశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. త‌ద్వారా వంద‌ల సంఖ్యంలో ఉద్యోగాలు ల‌భిస్తాయి.

— రెండో ద‌శ‌లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది.

— ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. త‌ద్వారా విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఆటంకం లేని వ్య‌వ‌స్థ అందుబాటులోకి రానుంది.

— స్థానికుల‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

This post was last modified on May 14, 2025 1:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nara Lokesh

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago