Political News

ఆపరేషన్ కెల్లార్!… నాయక్ మృతికి రివెంజ్ దెబ్బ!

పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మంది కరడుగట్టిన తీవ్రవాదులతో పాటుగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా దాదాపుగా ధృవీకరించింది. అయితే పాక్ ప్రోత్సాహంతో ఉగ్ర మూకలు భారత సైన్యంపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఏపీకి చెందిన వీర జవాన్ మురళి నాయక్ అసువులు బాశారు. పోషియాన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు తాజాగా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి.

పోషియాన్ పరిధిలోని కెల్లార్ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భారత సైన్యం ఆపరేషన్ కెల్లార్ పేరిట మంగళవారం ఓ ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో బారత సైన్యాన్ని చూసినంతనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే సాగిన భారత సైనికులు అక్కడ సంచరిస్తున్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టారు. చనిపోయిన వీరంతా కూడా కరడుగట్టిన ఉగ్రవాదులేనని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెరసి మరింత మంది ఉగ్రవాదులు కెల్లార్ ప్రాంతంలో దాక్కున్నట్లుగా సమాచారం.

పోషియాన్ అనేది జమ్ము కశ్మీర్ లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి చెప్పుకోవాలి. ఇక్కడ పనిచేసే బారత సైనికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తూ సాగుతుంటారు. ఎందుకంటే…నిత్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ విరుచుకుపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటివలే జరిగిన దాడుల్లో మురళి నాయక్ మృత్యువాత పడ్డారు. ఈ మృతిని తీవ్రంగా పరిగణించిన భారత సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాద కదలికలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా…మరికొందరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 13, 2025 2:38 pm

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

2 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago