Political News

ఆపరేషన్ కెల్లార్!… నాయక్ మృతికి రివెంజ్ దెబ్బ!

పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మంది కరడుగట్టిన తీవ్రవాదులతో పాటుగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా దాదాపుగా ధృవీకరించింది. అయితే పాక్ ప్రోత్సాహంతో ఉగ్ర మూకలు భారత సైన్యంపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఏపీకి చెందిన వీర జవాన్ మురళి నాయక్ అసువులు బాశారు. పోషియాన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు తాజాగా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి.

పోషియాన్ పరిధిలోని కెల్లార్ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భారత సైన్యం ఆపరేషన్ కెల్లార్ పేరిట మంగళవారం ఓ ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో బారత సైన్యాన్ని చూసినంతనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే సాగిన భారత సైనికులు అక్కడ సంచరిస్తున్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టారు. చనిపోయిన వీరంతా కూడా కరడుగట్టిన ఉగ్రవాదులేనని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెరసి మరింత మంది ఉగ్రవాదులు కెల్లార్ ప్రాంతంలో దాక్కున్నట్లుగా సమాచారం.

పోషియాన్ అనేది జమ్ము కశ్మీర్ లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి చెప్పుకోవాలి. ఇక్కడ పనిచేసే బారత సైనికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తూ సాగుతుంటారు. ఎందుకంటే…నిత్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ విరుచుకుపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటివలే జరిగిన దాడుల్లో మురళి నాయక్ మృత్యువాత పడ్డారు. ఈ మృతిని తీవ్రంగా పరిగణించిన భారత సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాద కదలికలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా…మరికొందరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 13, 2025 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago