Political News

కూటమి సర్కారును మెచ్చుకున్న జగన్!

సమయం ఏదైనా, సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య ప్రోత్సాహకర, పొగడ్తలతో కూడిన వ్యాఖ్యలు వినిపించవు. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే… కూటమి పార్టీలు, వైసీపీల మధ్య ఈ తరహా సుహృద్భావ వాతావరణం కనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే… కూటమి సర్కారు సారధి చంద్రబాబుతో పాటు ఉప సారథి పవన్ కల్యాణ్ లంటే… జగన్ కు అసలే గిట్టడం లేదు. వారి ప్రస్తావన వస్తేనే ఆయన ఓ రేంజిలో ఫైరవుతున్నారు. ఇక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న నెపంతో జగన్ పైనా వారిద్దరితో పాటు కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ నోట కూటమి సర్కారు పొగడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాలోని అమర జవాన్ మురళి నాయక్ ఇల్లు వేదికగా నిలిచింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇటీవలే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన నాయక్ అంతిమ యాత్రకు పవన్, నారా లోకేశ్ లతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. లోకేశ్ స్వయంగా నాయక్ పార్థీవ దేహాన్ని మోసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. బాదిత కుటుంబానికి 5 ఎకాల పొలం, నాయక్ తండ్రికి సర్కారీ కొలువు కూడా ప్రకటించారు.

తాజాగా మంగళవారం మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కల్లి తండాకు వచ్చారు. ఈ సందర్భంగా నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన జగన్… వారి కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా నాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం నాయక్ ఇంటి ముందే మీడియాతో మాట్లాడిన జగన్… యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని తాము అదికారంలో ఉండగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి సర్కారు నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చిందన్న జగన్.. కూటమి సర్కారుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాని పేర్కొన్నారు.

జగన్ నోట కూటమి సర్కారును మెచ్చుకుంటూ వెలువడ్డ ఈ మాట అక్కడున్న వారితో పాటుగా జగన్ ప్రసంగాన్నిలైవ్ గా టీవీల్లో వీక్షిస్తున్న ఏపీ జనం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కూటమి పార్టీలు అన్నా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అన్నా నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేసే జగన్…. నాయక్ కుటుంబానికి చేసిన సర్కారీ సాయాన్ని గుర్తు చేసుకుని మరీ కూటమి సర్కారును మెచ్చుకోవడం నిజంగానే గమనార్హం. అయితే ఈ అంశానికి కూడా తన పార్టీ ప్రభుత్వానికి ముడిపెట్టి మరీ జగన్.. కూటమి సర్కారును మెచ్చుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదైతేనేం.. కూటమిని జగన్ మెచ్చుకున్నారు కదా… అదే చాలు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on May 13, 2025 2:34 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago