Political News

కూటమి సర్కారును మెచ్చుకున్న జగన్!

సమయం ఏదైనా, సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య ప్రోత్సాహకర, పొగడ్తలతో కూడిన వ్యాఖ్యలు వినిపించవు. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే… కూటమి పార్టీలు, వైసీపీల మధ్య ఈ తరహా సుహృద్భావ వాతావరణం కనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే… కూటమి సర్కారు సారధి చంద్రబాబుతో పాటు ఉప సారథి పవన్ కల్యాణ్ లంటే… జగన్ కు అసలే గిట్టడం లేదు. వారి ప్రస్తావన వస్తేనే ఆయన ఓ రేంజిలో ఫైరవుతున్నారు. ఇక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న నెపంతో జగన్ పైనా వారిద్దరితో పాటు కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ నోట కూటమి సర్కారు పొగడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాలోని అమర జవాన్ మురళి నాయక్ ఇల్లు వేదికగా నిలిచింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇటీవలే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన నాయక్ అంతిమ యాత్రకు పవన్, నారా లోకేశ్ లతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. లోకేశ్ స్వయంగా నాయక్ పార్థీవ దేహాన్ని మోసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. బాదిత కుటుంబానికి 5 ఎకాల పొలం, నాయక్ తండ్రికి సర్కారీ కొలువు కూడా ప్రకటించారు.

తాజాగా మంగళవారం మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కల్లి తండాకు వచ్చారు. ఈ సందర్భంగా నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన జగన్… వారి కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా నాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం నాయక్ ఇంటి ముందే మీడియాతో మాట్లాడిన జగన్… యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని తాము అదికారంలో ఉండగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి సర్కారు నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చిందన్న జగన్.. కూటమి సర్కారుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాని పేర్కొన్నారు.

జగన్ నోట కూటమి సర్కారును మెచ్చుకుంటూ వెలువడ్డ ఈ మాట అక్కడున్న వారితో పాటుగా జగన్ ప్రసంగాన్నిలైవ్ గా టీవీల్లో వీక్షిస్తున్న ఏపీ జనం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కూటమి పార్టీలు అన్నా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అన్నా నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేసే జగన్…. నాయక్ కుటుంబానికి చేసిన సర్కారీ సాయాన్ని గుర్తు చేసుకుని మరీ కూటమి సర్కారును మెచ్చుకోవడం నిజంగానే గమనార్హం. అయితే ఈ అంశానికి కూడా తన పార్టీ ప్రభుత్వానికి ముడిపెట్టి మరీ జగన్.. కూటమి సర్కారును మెచ్చుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదైతేనేం.. కూటమిని జగన్ మెచ్చుకున్నారు కదా… అదే చాలు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on May 13, 2025 2:34 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago