Political News

సాయంత్రం చ‌ర్చ‌లు- అర్ధ‌రాత్రి దాడులు: తిప్పికొట్టిన భార‌త్‌

పాకిస్థాన్ త‌న ద‌మ‌న నీతిని మ‌రోసారి రుజువు చేసుకుంది. సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో భార‌త ఆర్మీ ఆప‌రేష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌తో పాకిస్థాన్ ఆర్మీ ఆప‌రేష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఫోన్ చేసి సుమారు గంట‌పాటు చ‌ర్చించారు. ఇక‌పై.. తాము స‌రిహ‌ద్దుల నుంచి సైన్యాన్ని వెన‌క్కి తిరిగి ర‌ప్పిస్తామ‌ని.. మీరు కూడా అలానే చేయాల‌ని పాక్ అధికారి కోరారు. దీనికి భార‌త్ అంగీక‌రించింది. అదేవిదంగా మేం మిస్సైళ్ల‌ను, డ్రోన్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌యోగించ‌బోమ‌ని.. ద‌య‌చేసి మీరు కూడా మీ మీ వ్య‌వ‌స్థ‌ల‌ను వెనక్కి పిల‌వాల‌ని పాక్ అధికారి ప్రాధేయ ప‌డ్డారు.

దీనికి కూడా భార‌త్ అంగీక‌రించింది. ఆ త‌ర్వాత‌.. గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని.. దీనిని అంతం చేసే వ‌ర‌కు ఆ దేశానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం ముగిసిన‌(8.22 నిమిషాల‌కు) గంట సేప‌టిలోనే పాకిస్థాన్ త‌న దుష్ట‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించింది. వాస్తవాధీన రేఖ వెంబ‌డి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాంబ, ఆర్నియా సెక్టార్లలో కాల్పులు, డ్రోన్ల దాడితో మ‌రోసారి భీతావ‌హ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. దీంతో ప్ర‌జ‌లు భీతిల్లిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

దీంతో హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగించారు. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సాంబా, ఆర్నియాలో డ్రోన్‌ కదలికలను గుర్తించిన భార‌త సైన్యం.. అంతే దీటుగా వాటిని ధ్వంసం చేసింది. భార‌త్ ప్ర‌యోగించిన డ్రోన్లు .. పాక్ డ్రోన్ల‌ను త‌క్ష‌ణం నేల కూల్చాయ‌ని అధికారులు తెలిపారు. ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని పేర్కొన్నారు. కాగా.. పాక్ మ‌రోసారి దుస్సాహ‌సానికి దారితీయ‌డంతో పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ చేశారు. అంటే.. అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు.

కాగా.. పాక్ మ‌రోసారి కాల్పుల‌కు, డ్రోన్ దాడుల‌కు దిగ‌డం ప‌ట్ల‌.. అధికారులు సోమ‌వారం అర్ధ‌రాత్రి మ‌రోసారి చ‌ర్చించారు. ఎలాంటి ప‌రిస్థితినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. స‌రిహ‌ద్దుల వెంబ‌డి సైన్యాన్ని వెన‌క్కి ర‌ప్పించ‌రాద‌ని.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న సైన్యాన్ని అలానే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించా రు. ఇదిలావుంటే.. మంగ‌ళ‌వారం అమెరికాతో భార‌త్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on May 13, 2025 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

3 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

3 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

6 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

8 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

16 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

16 hours ago