Political News

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశాం: ప్ర‌ధాని మోడీ

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కేవ‌లం ఆప‌రేష‌న్ కాద‌ని.. దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. తొలుత ఆయ‌న శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌.. అనేది కేవ‌లం మాట కాద‌ని.. ఇది కోట్లాది మంది మ‌హిళ‌లకు చిహ్న‌మ‌ని పేర్కొన్నారు. ప‌హ‌ల్గాంలో అమా య‌కుల‌ను పొట్టున పెట్టుకున్నార‌ని చెప్పారు. అమాయ‌క పౌరుల‌ను పాకిస్థాన్ పొట్ట‌న పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌తం పేరు అడిగి మ‌రీ ప్రాణాలు తీశార‌ని.. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో మ‌న సైన్యం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు.

ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు. భార‌త సైన్యం చూపిన తెగువ‌కు పాక్ నిరాశ నిస్పృహ‌ల్లో కూరుకుపోయింద ని.. అచేత‌న స్థితికి చేరుకుంద‌ని ప్ర‌ధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగిపోయింద‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదులు క‌ల‌లో కూడా ఊహించ‌నంత దారుణంగా భార‌త్ వారిని తుడిచి పెట్టేసింద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం క‌చ్చిత‌మైన ల‌క్ష్యంతో దాడులు చేసింద‌ని.. దీంతో పాక్ కు దిక్కులేకుండా పోయింద‌న్నారు.

మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం..

భార‌త సైన్యం, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు.. వంటివి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు ఇలా.. అన్ని చోట్లా మ‌నం స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పడంలో మ‌న బ‌లం, బ‌ల‌గం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

This post was last modified on May 12, 2025 10:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago