Political News

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశాం: ప్ర‌ధాని మోడీ

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కేవ‌లం ఆప‌రేష‌న్ కాద‌ని.. దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. తొలుత ఆయ‌న శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌.. అనేది కేవ‌లం మాట కాద‌ని.. ఇది కోట్లాది మంది మ‌హిళ‌లకు చిహ్న‌మ‌ని పేర్కొన్నారు. ప‌హ‌ల్గాంలో అమా య‌కుల‌ను పొట్టున పెట్టుకున్నార‌ని చెప్పారు. అమాయ‌క పౌరుల‌ను పాకిస్థాన్ పొట్ట‌న పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌తం పేరు అడిగి మ‌రీ ప్రాణాలు తీశార‌ని.. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో మ‌న సైన్యం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు.

ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు. భార‌త సైన్యం చూపిన తెగువ‌కు పాక్ నిరాశ నిస్పృహ‌ల్లో కూరుకుపోయింద ని.. అచేత‌న స్థితికి చేరుకుంద‌ని ప్ర‌ధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగిపోయింద‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదులు క‌ల‌లో కూడా ఊహించ‌నంత దారుణంగా భార‌త్ వారిని తుడిచి పెట్టేసింద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం క‌చ్చిత‌మైన ల‌క్ష్యంతో దాడులు చేసింద‌ని.. దీంతో పాక్ కు దిక్కులేకుండా పోయింద‌న్నారు.

మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం..

భార‌త సైన్యం, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు.. వంటివి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు ఇలా.. అన్ని చోట్లా మ‌నం స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పడంలో మ‌న బ‌లం, బ‌ల‌గం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

This post was last modified on May 12, 2025 10:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago