Political News

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశాం: ప్ర‌ధాని మోడీ

ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టిలో క‌లిపేశామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కేవ‌లం ఆప‌రేష‌న్ కాద‌ని.. దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. తొలుత ఆయ‌న శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌.. అనేది కేవ‌లం మాట కాద‌ని.. ఇది కోట్లాది మంది మ‌హిళ‌లకు చిహ్న‌మ‌ని పేర్కొన్నారు. ప‌హ‌ల్గాంలో అమా య‌కుల‌ను పొట్టున పెట్టుకున్నార‌ని చెప్పారు. అమాయ‌క పౌరుల‌ను పాకిస్థాన్ పొట్ట‌న పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌తం పేరు అడిగి మ‌రీ ప్రాణాలు తీశార‌ని.. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో మ‌న సైన్యం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు.

ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు. భార‌త సైన్యం చూపిన తెగువ‌కు పాక్ నిరాశ నిస్పృహ‌ల్లో కూరుకుపోయింద ని.. అచేత‌న స్థితికి చేరుకుంద‌ని ప్ర‌ధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగిపోయింద‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదులు క‌ల‌లో కూడా ఊహించ‌నంత దారుణంగా భార‌త్ వారిని తుడిచి పెట్టేసింద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం క‌చ్చిత‌మైన ల‌క్ష్యంతో దాడులు చేసింద‌ని.. దీంతో పాక్ కు దిక్కులేకుండా పోయింద‌న్నారు.

మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం..

భార‌త సైన్యం, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు.. వంటివి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు ఇలా.. అన్ని చోట్లా మ‌నం స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పడంలో మ‌న బ‌లం, బ‌ల‌గం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

Satya

Recent Posts

`అన్న‌లు` లేని లోటు తీరుస్తాం: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

50 seconds ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

6 minutes ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

39 minutes ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

1 hour ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

2 hours ago

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

2 hours ago