‘భారత సైన్యమా.. వెనుకడుగు వేయకు.. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు!’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన పోస్టుచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించినా.. అమితాబ్ బచ్చన్ చాలా సంయమనం పాటించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని.. పహల్గామ్ దాడిలో తమ నుదిటి సిందూరాన్ని కోల్పోయిన భారత పుత్రికలను ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు.
పహల్గామ్ దాడిలో తమ ముందే భర్తలను కాల్చేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. గతంలో తన తండ్రి, ప్రఖ్యాత హిందీ కవి హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితలను తన పోస్టులో ప్రత్యేకంగా పేర్కొ న్నారు. ‘‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా.. సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది’’ అని హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితా సంకలనంలోని పదాన్ని ప్రస్తావిస్తూ.. అందుకే ఆమెకు సిందూరం ఇస్తున్నా.. అదే ఆపరేషన్ సిందూర్ అని బిగ్ బీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు ఘటనలను, ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. ‘‘భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్రవాదులు దారుణంగా హత మార్చారు. భర్తను చంపొద్దంటూ భార్య కాళ్లా వేళ్లాపడినా.. నిర్దయగా ఆ ఉన్మాది కాల్చేశాడు. ఆమె నుదుట సిందూరం తుడిచేశాడు. ఆమె ‘నన్ను కూడా చంపేయ్’ అంటూ మోకరిల్లింది. అప్పుడు ఆ రాక్షసుడు.. ‘నిన్ను చంపను. వెళ్లి.. చెప్పుకో’’ అని రాక్షసత్వం ప్రదర్శించాడు.
ఆమె నా కుమార్తెతో సమానం. ఆమె ఎంత అలమటించిపోయిందో.. నేను అర్దం చేసుకోగలను. అందుకే నాన్న(హరివంశ రాయ్ బచ్చన్) రాసిన పద్యం గుర్తుకొచ్చింది. సైన్యామా నువ్వు వెనుకడుగు వేయకు. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఇది భారతీయుల సంకల్పం. ఆపరేషన్ సిందూర్! అని బిగ్ బీ పోస్టులో పేర్కొన్నారు.
This post was last modified on May 12, 2025 12:15 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…