Political News

పాక్‌పై మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని తాము కోరుకోవ‌డం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ విష‌యంలో త‌మ విధానం ఎప్పుడూ మార‌బోద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ విష‌యంలో పాకిస్థాన్‌కు ప్ర‌త్యామ్నాయ మార్గం అంటూ మ‌రొక‌టి లేద‌ని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్న‌యితే ఆక్ర‌మించుకుందో.. దానిని తిరిగిభార‌త్‌కు ఇచ్చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కు మించిన ఆశ‌లు ఉంటే పాక్‌కు వాటిని విర‌మించుకోవాల్సిందేన‌ని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్ విష‌యంలో భార‌త్ నుంచి ఇంత‌క‌న్నా ఎక్కువగా ఊహించుకోవ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున కేంద్ర ప్ర‌భుత్వం పాక్ ఆక్ర‌మిక క‌శ్మీర్‌ను చేజిక్కించుకోవ‌డం ఒక్క‌టే మా అజెండా. దీనిని భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు. కశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు అని మోడీ తేల్చి చెప్పారు.

ప్ర‌స్తుతం పాకిస్థాన్‌-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌ను పాకిస్థాన్ వైలేట్ చేయ‌డంపై ప్ర‌ధాని సుదీర్ఘంగా త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంట‌ల‌కు పైగానే ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీనిలో విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాధిప‌తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌పై మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపింది.

This post was last modified on May 12, 2025 12:08 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago