Political News

పాక్‌పై మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని తాము కోరుకోవ‌డం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ విష‌యంలో త‌మ విధానం ఎప్పుడూ మార‌బోద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ విష‌యంలో పాకిస్థాన్‌కు ప్ర‌త్యామ్నాయ మార్గం అంటూ మ‌రొక‌టి లేద‌ని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్న‌యితే ఆక్ర‌మించుకుందో.. దానిని తిరిగిభార‌త్‌కు ఇచ్చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కు మించిన ఆశ‌లు ఉంటే పాక్‌కు వాటిని విర‌మించుకోవాల్సిందేన‌ని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్ విష‌యంలో భార‌త్ నుంచి ఇంత‌క‌న్నా ఎక్కువగా ఊహించుకోవ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున కేంద్ర ప్ర‌భుత్వం పాక్ ఆక్ర‌మిక క‌శ్మీర్‌ను చేజిక్కించుకోవ‌డం ఒక్క‌టే మా అజెండా. దీనిని భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు. కశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు అని మోడీ తేల్చి చెప్పారు.

ప్ర‌స్తుతం పాకిస్థాన్‌-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌ను పాకిస్థాన్ వైలేట్ చేయ‌డంపై ప్ర‌ధాని సుదీర్ఘంగా త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంట‌ల‌కు పైగానే ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీనిలో విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాధిప‌తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌పై మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపింది.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

56 minutes ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

1 hour ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

1 hour ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

2 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago