ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని నర్మగర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ విధానం ఎప్పుడూ మారబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో పాకిస్థాన్కు ప్రత్యామ్నాయ మార్గం అంటూ మరొకటి లేదని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్నయితే ఆక్రమించుకుందో.. దానిని తిరిగిభారత్కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు.
ఇంతకు మించిన ఆశలు ఉంటే పాక్కు వాటిని విరమించుకోవాల్సిందేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ నుంచి ఇంతకన్నా ఎక్కువగా ఊహించుకోవద్దని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. 140 కోట్ల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిక కశ్మీర్ను చేజిక్కించుకోవడం ఒక్కటే మా అజెండా. దీనిని భారత్కు అప్పగించడం తప్ప పాక్కు వేరే మార్గం లేదు. కశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు అని మోడీ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. కాల్పుల విరమణ అవగాహనను పాకిస్థాన్ వైలేట్ చేయడంపై ప్రధాని సుదీర్ఘంగా త్రివిధ దళాధిపతులతో చర్చించారు. ప్రస్తుతం పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటలకు పైగానే ఈ చర్చలు జరిగాయి. దీనిలో విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్పై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…