Political News

పాక్‌పై మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని తాము కోరుకోవ‌డం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ విష‌యంలో త‌మ విధానం ఎప్పుడూ మార‌బోద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ విష‌యంలో పాకిస్థాన్‌కు ప్ర‌త్యామ్నాయ మార్గం అంటూ మ‌రొక‌టి లేద‌ని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్న‌యితే ఆక్ర‌మించుకుందో.. దానిని తిరిగిభార‌త్‌కు ఇచ్చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కు మించిన ఆశ‌లు ఉంటే పాక్‌కు వాటిని విర‌మించుకోవాల్సిందేన‌ని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్ విష‌యంలో భార‌త్ నుంచి ఇంత‌క‌న్నా ఎక్కువగా ఊహించుకోవ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున కేంద్ర ప్ర‌భుత్వం పాక్ ఆక్ర‌మిక క‌శ్మీర్‌ను చేజిక్కించుకోవ‌డం ఒక్క‌టే మా అజెండా. దీనిని భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు. కశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు అని మోడీ తేల్చి చెప్పారు.

ప్ర‌స్తుతం పాకిస్థాన్‌-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌ను పాకిస్థాన్ వైలేట్ చేయ‌డంపై ప్ర‌ధాని సుదీర్ఘంగా త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంట‌ల‌కు పైగానే ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీనిలో విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాధిప‌తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌పై మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపింది.

This post was last modified on May 12, 2025 12:08 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

53 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

3 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

5 hours ago