Political News

వారి క‌న్నీళ్లు చూసి.. క‌రిగిపోయిన ప‌వ‌న్‌!

రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి, ఒక పార్టీకి అధినేత‌.. భ‌యంక‌ర‌మైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌వారి క‌ష్టాన్ని చూసి ఆయ‌న చ‌లించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్ర‌మంలో ఆయ‌నా క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌ లో పాల్గొని జ‌మ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమ‌ర‌వీరుడైనా అనంత‌పురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్‌.. అంత్య‌క్రియ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు.

ఉద‌యం మంత్రులు నారా లోకేష్‌.. అనిత, స‌విత‌ల‌తో క‌లిసి వీర జ‌వాన్ ఇంటికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత్య‌క్రియల ఘ‌ట్టం వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు. ఒక్క‌గానొక్క కుమారుడిని శ‌త్రుదేశం పొట్ట‌న పెట్టుకున్న తీరుతో అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్ త‌ల్లిదండ్రుల క‌న్నీటి సుడిలో చిక్కుకుపోయారు. తీవ్ర విషాద భ‌రిత‌మైన‌ అలాంటి సంద‌ర్భంగా వారిని ఓదార్చ‌లేక ప‌వ‌న్ క‌ల్యాణ్ వారి బాధ‌ను చూసి.. గుండెలు అవిసేలా విల‌పిస్తున్న జ్యోతిబాయిని చూసి క‌న్నీరు పెట్టుకున్నారు.

అతిక‌ష్టం మీద వారిని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతిమ సంస్కారానికి పార్థివ దేహం వెడ‌లుతున్న స‌మ‌యంలో మ‌రింత‌గా ఆ మాతృమూర్తి క‌న్నీటిలో క‌రిగిపోయారు. కొడుకా.. కొడుకా.. అంటూ త‌ల‌బాదు కుంటూ.. త‌న దిక్కులు పిక్క‌టిల్లేలా విల‌పించారు. ఇక‌, కొడుకు అమ‌ర‌డైన బాధ‌ను పంటిబిగువ‌న భ‌రించిన ఆయ‌న తండ్రి.. అతి క‌ష్టం మీద అంత్య‌క్రియ‌ల కోసం ముందుకు సాగారు. ఈ కార్య‌క్ర‌మంలో తుది వ‌ర‌కు పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, అనిత స‌హా ప‌లువురు విష‌ణ్ణ వ‌ద‌నాల‌తో క‌నిపించారు.

This post was last modified on May 11, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

40 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

46 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago