Political News

మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. అమర జవాను మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం అందజేస్తామన్నారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

మురళీ నాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, యువతకు మురళీ త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా తన నెల జీతాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ కుటుంబ సభ్యులను బాలయ్య పరామర్శించి సాయం అందించనున్నారు.

This post was last modified on May 11, 2025 2:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

21 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

57 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago