ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. అమర జవాను మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం అందజేస్తామన్నారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
మురళీ నాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, యువతకు మురళీ త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా తన నెల జీతాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ కుటుంబ సభ్యులను బాలయ్య పరామర్శించి సాయం అందించనున్నారు.
This post was last modified on May 11, 2025 2:55 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…