ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ.. పోలీసు అధికారులను నెట్టివేస్తున్న దృశ్యాలతో పాటుగా రజినీని చాకచక్యంగా తప్పించి ఆమె కారులోని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డగించే క్రమంలో రజినీ సాగిన తీరుతో పాటు.. పోలీసు అధికారులు ఆమెకు హెచ్చరికలు జారీ చేసిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.
గతంలో టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రజినీ… 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ చేరారు. చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీకి రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన రజినీ… మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా రజినీపై ఏసీబీ కేసు కూడా నమోదు కాగా… రజినీ మరిదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు కూడా చేశారు.
తాజాగా రజినీ అనుచరుల్లో ముఖ్యుడిగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి చిలకలూరిపేట నుంచి ఎక్కడికో కారులో రజినీ వెళుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి రజినీ కారును అడ్డగించిన పోలీసులు… శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏ కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రజినీ పోలీసులను ప్రశ్నించారు. అందుకు పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదు. అంతే… కారులో నుంచి దిగిన రజినీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
కారులో నుంచి దిగిన వెంటనే డోర్ ను బలవంతంగా మూసేసిన రజినీ… తనను అడ్డుకునేందుకు వచ్చిన సీఐని దాదాపుగా తోసేసినంత పని చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రజినీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదెక్కడి తీరు అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. కేసు ఏమిటో చెప్పకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో మీపై ఆల్రెడీ ఓ కేసు ఉందని. అడ్డుకుంటే…మరో కేసు పెడతానంటూ ఓ పోలీసు అదికారి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందించిన రజినీ… చేయండి, ఎలా చేస్తారో చూస్తానంటూ ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలోనే రజినీని లాఘవంగా డోర్ నుంచి దూరంగా తప్పించిన పోలీసులు కారులోకి ఎక్కి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on May 10, 2025 9:29 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…