ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ.. పోలీసు అధికారులను నెట్టివేస్తున్న దృశ్యాలతో పాటుగా రజినీని చాకచక్యంగా తప్పించి ఆమె కారులోని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డగించే క్రమంలో రజినీ సాగిన తీరుతో పాటు.. పోలీసు అధికారులు ఆమెకు హెచ్చరికలు జారీ చేసిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.
గతంలో టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రజినీ… 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ చేరారు. చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీకి రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన రజినీ… మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా రజినీపై ఏసీబీ కేసు కూడా నమోదు కాగా… రజినీ మరిదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు కూడా చేశారు.
తాజాగా రజినీ అనుచరుల్లో ముఖ్యుడిగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి చిలకలూరిపేట నుంచి ఎక్కడికో కారులో రజినీ వెళుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి రజినీ కారును అడ్డగించిన పోలీసులు… శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏ కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రజినీ పోలీసులను ప్రశ్నించారు. అందుకు పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదు. అంతే… కారులో నుంచి దిగిన రజినీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
కారులో నుంచి దిగిన వెంటనే డోర్ ను బలవంతంగా మూసేసిన రజినీ… తనను అడ్డుకునేందుకు వచ్చిన సీఐని దాదాపుగా తోసేసినంత పని చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రజినీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదెక్కడి తీరు అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. కేసు ఏమిటో చెప్పకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో మీపై ఆల్రెడీ ఓ కేసు ఉందని. అడ్డుకుంటే…మరో కేసు పెడతానంటూ ఓ పోలీసు అదికారి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందించిన రజినీ… చేయండి, ఎలా చేస్తారో చూస్తానంటూ ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలోనే రజినీని లాఘవంగా డోర్ నుంచి దూరంగా తప్పించిన పోలీసులు కారులోకి ఎక్కి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on May 10, 2025 9:29 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…