భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ప్రకటించారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ నెల 12న పాకిస్థాన్ విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓ, పాక్ డీజీఎంఓలకు ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరామని మిస్రీ తెలిపారు.
భూ,గగన, సముద్రతలాలకు కాల్పుల విరమణ వర్తిస్తుందని చెప్పారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయన్నారు. పాక్ మంత్రి ఇషాక్దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరపడినట్లయింది.
కాగా, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉన్న పలు రాష్ట్రాలలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్న వార్త విని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on May 10, 2025 6:59 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…