భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,
మాపో అధికారికంగా కూడా మిలిటరీ చర్యలకు ఇరుదేశాలు దిగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఒక రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు తెలివైన నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. ఈ విషయాన్ని తాను తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని ట్రంప్ అన్నారు. తక్షణమే ఇరుదేశాల మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు.
అయితే ఈ వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
This post was last modified on May 10, 2025 5:59 pm
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…