భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,
మాపో అధికారికంగా కూడా మిలిటరీ చర్యలకు ఇరుదేశాలు దిగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఒక రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు తెలివైన నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. ఈ విషయాన్ని తాను తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని ట్రంప్ అన్నారు. తక్షణమే ఇరుదేశాల మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు.
అయితే ఈ వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
This post was last modified on May 10, 2025 5:59 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…