ఎంతమంది నేతలు మారినా పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దేశం ఎదుగుదలపై దృష్టి పెట్టడం కంటే రోజూ భారత్పై ఆరోపణలు చేయడం, కాశ్మీర్ కోసం గొడవపడడం పాక్ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యం. ఈ పరిస్థితిపై పాకిస్తాన్ ప్రజలే ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. “ముందు మనం తినడానికి సరిపడే ఎదుగుదల గురించి ఆలోచించండి?” అని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులోనూ IMF ఇచ్చిన తాజా బిలియన్ డాలర్ల అప్పు మరింతగా చర్చకు దారితీస్తోంది.
IMF అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund), ఇది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. దీని ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాలకు రుణాలు, సాంకేతిక సహాయం అందించి వాటి ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడం.
అయితే గతంలో పాక్ ఎన్నో సార్లు IMFను “ప్రజల ఆకలిని తీరుస్తాం” అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ సమయంలో IMF పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో మాత్రం అప్రూవల్ అతి వేగంగా రావడం వింతగా ఉంది. IMF చూపించిన సపోర్ట్ వెనుక వాస్తవం వేరేమోనని అంతర్జాతీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ చైనా పాత్రపై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది. చైనా డైరెక్ట్ గా మధ్యలోకి రావాలంటే అంత సులభం కాదు, ఎందుకంటే రష్యా ఈ పరిస్థితుల్లో మరింత బలంగా భారత్ వెనక నిలిచే అవకాశముంది. అందుకే చైనా బ్యాక్డోర్లో, అంటే IMF వంటి వేదికల ద్వారా పాక్కి సపోర్ట్ చేస్తుందేమో అన్నది ఇప్పుడు ప్రధాన అనుమానం. IMF వంటి సంస్థల్లో చైనా ప్రాబల్యం గణనీయమైనది. చైనా అండతోనే ఇంత వేగంగా ఆమోదం వచ్చిందా? అనే దానిపై పలు రాజకీయ వర్గాలు చర్చ మొదలు పెట్టాయి.
పాక్ను ఆకలితో కుస్తీ పడుతున్నప్పుడు IMF కనికరం చూపకపోగా, ఇప్పుడు యుద్ధ వేళ మాత్రం అతి వేగంగా ఆర్థిక సహాయం అందించడం వెనుక కారణాలు సూటిగా అర్థం కావు. నిజంగా ఇది పాక్ ప్రజల కోసం వెళ్తుందా? మరింత సైనిక వ్యూహాలకు, దాడులకు ఇంధనం అవుతుందా? అన్నది కీలక ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరింత జాగ్రత్తగా రాజకీయ అంచనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది.
`
This post was last modified on May 10, 2025 12:58 pm
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…