Political News

ఈ టైం లో పాక్ కి అప్పు ఇచ్చిన IMF

ఎంతమంది నేతలు మారినా పాకిస్తాన్‌లో ఆర్థిక కష్టాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దేశం ఎదుగుదలపై దృష్టి పెట్టడం కంటే రోజూ భారత్‌పై ఆరోపణలు చేయడం, కాశ్మీర్ కోసం గొడవపడడం పాక్ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యం. ఈ పరిస్థితిపై పాకిస్తాన్ ప్రజలే ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. “ముందు మనం తినడానికి సరిపడే ఎదుగుదల గురించి ఆలోచించండి?” అని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులోనూ IMF ఇచ్చిన తాజా బిలియన్ డాలర్ల అప్పు మరింతగా చర్చకు దారితీస్తోంది.

IMF అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund), ఇది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. దీని ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాలకు రుణాలు, సాంకేతిక సహాయం అందించి వాటి ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడం.

అయితే గతంలో పాక్ ఎన్నో సార్లు IMFను “ప్రజల ఆకలిని తీరుస్తాం” అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ సమయంలో IMF పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో మాత్రం అప్రూవల్ అతి వేగంగా రావడం వింతగా ఉంది. IMF చూపించిన సపోర్ట్ వెనుక వాస్తవం వేరేమోనని అంతర్జాతీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ చైనా పాత్రపై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది. చైనా డైరెక్ట్ గా మధ్యలోకి రావాలంటే అంత సులభం కాదు, ఎందుకంటే రష్యా ఈ పరిస్థితుల్లో మరింత బలంగా భారత్ వెనక నిలిచే అవకాశముంది. అందుకే చైనా బ్యాక్‌డోర్‌లో, అంటే IMF వంటి వేదికల ద్వారా పాక్‌కి సపోర్ట్ చేస్తుందేమో అన్నది ఇప్పుడు ప్రధాన అనుమానం. IMF వంటి సంస్థల్లో చైనా ప్రాబల్యం గణనీయమైనది. చైనా అండతోనే ఇంత వేగంగా ఆమోదం వచ్చిందా? అనే దానిపై పలు రాజకీయ వర్గాలు చర్చ మొదలు పెట్టాయి.

పాక్‌ను ఆకలితో కుస్తీ పడుతున్నప్పుడు IMF కనికరం చూపకపోగా, ఇప్పుడు యుద్ధ వేళ మాత్రం అతి వేగంగా ఆర్థిక సహాయం అందించడం వెనుక కారణాలు సూటిగా అర్థం కావు. నిజంగా ఇది పాక్ ప్రజల కోసం వెళ్తుందా? మరింత సైనిక వ్యూహాలకు, దాడులకు ఇంధనం అవుతుందా? అన్నది కీలక ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరింత జాగ్రత్తగా రాజకీయ అంచనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది.
`

This post was last modified on May 10, 2025 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవ.. ఆ ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

11 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

47 minutes ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

59 minutes ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

2 hours ago