Political News

టీడీపీ ఆఫీస్‌పై దాడి.. ఎవ్వరికీ తెలీదంట

వైసీపీ నాయ‌కుడు, గ‌త వైసీపీ స‌ర్కారులో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయ‌కుడు, విజ‌య‌వాడ వైసీపీ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినా ష్ చౌద‌రిల‌ను తాజాగా ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు. 2021-22 మ‌ధ్య కాలంలో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫ‌ర్నిచ‌ర్ స‌హా.. అద్దాలు కూడా ధ్వంస‌మ‌య్యాయి.

ప‌లువురు కార్య‌క‌ర్త‌లు కూడా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. ఒక పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిందంటూ.. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అలాంటి కేసు.. వైసీపీ హ‌యాంలో నిర్వీర్యం అయ్యేలాకొంద‌రు వ్య‌వ‌హ‌రించారు. కానీ, కూట‌మి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ కేసును తిర‌గ‌దోడ‌డంతోపాటు.. ప‌లువురిపై కేసులు న‌మోదు చేసింది. నాటి దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి 26మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

ఇంత తీవ్రత ఉన్న కేసుపై తాజాగా జ‌రిగిన విచార‌ణలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అస‌లు త‌న‌కు ఈ దాడి గురించి తెలియనే తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు. అస‌లు అప్ప‌ట్లోతాను ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో తీరిక లేకుండా ఉన్నాన‌ని.. ఫోన్లు కూడా పక్కన పెట్టాన‌ని సీఐడీ అధికారులకు చెప్పుకొచ్చారు. తెల్ల‌వారి పేప‌ర్ల చూసిన త‌ర్వాతే.. ఏదో కార్యాల‌యంపై దాడి జ‌రిగింద‌ని తెలిసింద‌ని.. అప్ప‌ట్లోనే తాను దీనిని ఖండించాన‌ని వివ‌రించారు. దీంతో సీఐడీ అధికారులు వివ‌రాలు న‌మోదు చేసుకుని స‌జ్జ‌ల‌ను బ‌య‌ట‌కు పంపించారు.

ఇక‌, దేవినేని అవినాష్ కూడా.. తాను అప్ప‌ట్లో ఊళ్లోనే లేన‌ని.. సొంత ప‌నుల‌పై బెంగ‌ళూరుకు వెళ్లాన‌ని చెప్పారు. కానీ.. దాడి జ‌రిగిన స‌మ‌యంలో ప‌క్క‌నే రోడ్డుపై ఒక కారులో దేవినేని అవినాష్ కూర్చుని ఉన్న ఫొటోల‌ను అధికారులు ఆయ‌న‌కు చూపించ‌గా.. అవి న‌కిలీవ‌ని కొట్టిపారేశారు. ఇదిలావుంటే.. విచార‌ణ నిమిత్తం సీఐడీ ఆఫీసుకువ‌చ్చిన స‌జ్జ‌ల‌కు మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీస్వాగ‌తం ప‌ల‌కడం.. బొకే ఆయ‌న చేతికి అందించే ప్ర‌య‌త్నం చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.

This post was last modified on May 9, 2025 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago