వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. వచ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాదయాత్రకు రెడీ అవుతున్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఈవిషయంపై అనుకూల మీడియా జోరుగా కథనాలు రాస్తోంది. అయితే..ఈ పాదయాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. అసలు పాదయాత్ర ప్రారంభిస్తే.. జగన్ కు కొన్నిప్రశ్నలు ఎదురు కాకతప్పదు. పాదయాత్ర అనేది నాయకులు చేయడం తప్పుకాదు. ఆమాటకు వస్తే.. నర్మదా బచావో ఆందోళన్ సమయంలో అనేక మంది పాదయాత్ర చేశారు.
అయితే.. ఏ పాదయాత్రకైనా అర్ధం ఉండాలి. ఆ తర్వాతే పరమార్థం చేకూరుతుంది. ఏదైనా ఒక సారి చేస్తే ముద్దు.. కానీ.. పదే పదే చేస్తే..? అదే ఇప్పుడు జగన్కు ముసురుకున్న ప్రశ్న. ఎందుకంటే 2019 ఎన్నికల కు ముందు జగన్ పాదయాత్ర చేశారు. అప్పుడంటే.. ఆయన అధికారంలోకి రాలేదు. పాలన ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదు. పైగా యువ రక్తం పొంగిపొర్లుతున్న నాయకుడు కావడంతో కొంత మురిపెం ఉంది. అదే ఆయనకు విజయాన్ని అందించింది.
కానీ.. ఐదేళ్లు పాలన చేసిన తర్వాత.. మళ్లీ తగుదునమ్మా అంటూ పాదయాత్రకు వస్తే.. ప్రజలు ఏ రకంగా అర్ధం చేసుకుంటారు? అనేది కీలక ప్రశ్న. అసలు సమస్యలే తెలియవు అన్న చోట సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం తప్పుకాదు. ఇది నారా లోకేష్కు కలిసి వచ్చింది. ఆయన తండ్రి, సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్రాన్నిపాలించినా.. నారా లోకేష్ కొత్త కాబట్టి.. ఆయన పాదయాత్రకు బాగానే జోష్ వచ్చింది. కానీ.. జగన్ విషయం అలా కాదు కదా!
ఐదేళ్లు పాలన సాగించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఆయన పాలనపై ప్రజలకు ఒక పిక్చర్ వచ్చేసింది. అందుకే 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రజల మధ్యకు వెళ్లినా.. అవేసమస్యలు. అవే ఇబ్బందులు. పైగా గత ఐదేళ్ల పాలనపై జగన్ను నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రజల మధ్యకురాకపోవడం.. వచ్చినా చెట్లు నరికించి, ఆంక్షలు పెట్టించిన విధానం వంటివి జనాలు మరిచిపోలేదు. ప్రత్యర్థులు గుర్తు చేయకుండా కూడా ఉండరు. సో.. ఎలా చూసుకున్నా.. పాదయాత్ర వల్ల జగన్కు వచ్చే ప్రయోజనం తక్కువేనన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ.
This post was last modified on May 10, 2025 11:56 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…