Political News

రాజ‌కీయాలు బోరు కొట్టాయా.. ఈ నేత‌లు సైలెంట్‌.. !

ఏపీలో పార్టీల‌కు అతీతంగా ప‌లువురు నాయ‌కులు సైలెంట్ అయ్యారు. మ‌రి వీరికి క్రియాశీల రాజ‌కీయాలు బోరు కొట్టాయా ? లేక‌.. ఆయా పార్టీల తీరుపై వారు అల‌క బూనారా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. కీల‌క స‌మ‌యంలో నాయ‌కులు మౌనంగా ఉండ‌డంతో వైసీపీ ఇబ్బందులు ప‌డుతోంది. ఇక‌, ప్ర‌భుత్వం జోరుగా ఉన్న స‌మ‌యంలో స‌ర్కారు సైడు వాయిస్ వినిపించ‌డంలో సీనియ‌ర్లు ముందుకు రాక‌పోవ‌డంతో టీడీపీ కూడా ఇబ్బందులు ప‌డుతోంది.

ఇక‌, జ‌న‌సేన‌లో నాయ‌కులు ఉన్నా.. వారంతా అధినేత‌పైనే డిపెండ్ అయిపోయారు. మ‌రో పార్టీ బీజేపీలో వ‌ర్గ పోరు జోరుగా సాగుతోంది. ఇక్క‌డ రెండు వ‌ర్గాలు ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగిస్తున్నాయి. ఇక‌, కాంగ్రెస్ లో అస‌లు ఊపు ఉత్సాహం కూడా క‌రువ‌య్యాయి. దీంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా.. సీనియ‌ర్ల వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీడీపీలో సీనియ‌ర్లు ఎవ‌రూ మీడియా ముందుకు రావ‌డం లేదు.

సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌వారు.. ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మ‌రికొంద‌రు.. కాల‌క్షేపం కోసం పొరుగు రాష్ట్రాల‌కు వెళ్తున్నారు. దీంతో వాయిస్ వినిపించేందుకు జూనియ‌ర్‌ల‌ను ఎంచుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, వైసీపీలో జ‌గ‌న్ అంటే గిట్ట‌ని వారు.. ఆయ‌న విధానాల‌ను వ్యతిరేకిస్తున్నవారు.. కూడా ఇదే ప‌రిస్థితిలో ఉన్నారు. కొంద‌రు రాజ‌కీయాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ ఎస్ వ‌ర్గంగా ఉన్న‌వారు.. రాజ‌కీయాల‌ను కేంద్రంగా చేసుకున్న వారు.. రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో ర‌ఘువీరారెడ్డికి అధిష్టానం కీల‌క పాత్ర అప్ప‌గించినా.. ఆయ‌న త‌ప్పుకొన్నారు. ఇత‌ర నేత‌లు కూడా.. మ‌న‌కెందుకులే.. ఎన్నిక‌ల వ‌ర‌కు మౌనంగా ఉందాం.. అనే ఫార్ములాను అవ‌లంభిస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన‌లో నాయ‌కులు ఏమీ మాట్లాడొద్ద‌ని కొన్నాళ్ల కింద‌ట తిరుమ‌ల‌, తిరుప‌తి వివాదాలు వ‌చ్చిన‌ప్పుడు పార్టీ ఒక లైన్ గీసింది. అయితే.. నాయ‌కులు అప్ప‌టి నుంచి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇలా.. రాష్ట్రంలో సీనియ‌ర్లుగా ఉన్న నాయ‌కులు.. మౌన‌మే నీభాష అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

This post was last modified on July 26, 2025 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

4 hours ago