Political News

రాజ‌కీయాలు బోరు కొట్టాయా.. ఈ నేత‌లు సైలెంట్‌.. !

ఏపీలో పార్టీల‌కు అతీతంగా ప‌లువురు నాయ‌కులు సైలెంట్ అయ్యారు. మ‌రి వీరికి క్రియాశీల రాజ‌కీయాలు బోరు కొట్టాయా ? లేక‌.. ఆయా పార్టీల తీరుపై వారు అల‌క బూనారా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. కీల‌క స‌మ‌యంలో నాయ‌కులు మౌనంగా ఉండ‌డంతో వైసీపీ ఇబ్బందులు ప‌డుతోంది. ఇక‌, ప్ర‌భుత్వం జోరుగా ఉన్న స‌మ‌యంలో స‌ర్కారు సైడు వాయిస్ వినిపించ‌డంలో సీనియ‌ర్లు ముందుకు రాక‌పోవ‌డంతో టీడీపీ కూడా ఇబ్బందులు ప‌డుతోంది.

ఇక‌, జ‌న‌సేన‌లో నాయ‌కులు ఉన్నా.. వారంతా అధినేత‌పైనే డిపెండ్ అయిపోయారు. మ‌రో పార్టీ బీజేపీలో వ‌ర్గ పోరు జోరుగా సాగుతోంది. ఇక్క‌డ రెండు వ‌ర్గాలు ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగిస్తున్నాయి. ఇక‌, కాంగ్రెస్ లో అస‌లు ఊపు ఉత్సాహం కూడా క‌రువ‌య్యాయి. దీంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా.. సీనియ‌ర్ల వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీడీపీలో సీనియ‌ర్లు ఎవ‌రూ మీడియా ముందుకు రావ‌డం లేదు.

సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌వారు.. ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మ‌రికొంద‌రు.. కాల‌క్షేపం కోసం పొరుగు రాష్ట్రాల‌కు వెళ్తున్నారు. దీంతో వాయిస్ వినిపించేందుకు జూనియ‌ర్‌ల‌ను ఎంచుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, వైసీపీలో జ‌గ‌న్ అంటే గిట్ట‌ని వారు.. ఆయ‌న విధానాల‌ను వ్యతిరేకిస్తున్నవారు.. కూడా ఇదే ప‌రిస్థితిలో ఉన్నారు. కొంద‌రు రాజ‌కీయాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ ఎస్ వ‌ర్గంగా ఉన్న‌వారు.. రాజ‌కీయాల‌ను కేంద్రంగా చేసుకున్న వారు.. రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో ర‌ఘువీరారెడ్డికి అధిష్టానం కీల‌క పాత్ర అప్ప‌గించినా.. ఆయ‌న త‌ప్పుకొన్నారు. ఇత‌ర నేత‌లు కూడా.. మ‌న‌కెందుకులే.. ఎన్నిక‌ల వ‌ర‌కు మౌనంగా ఉందాం.. అనే ఫార్ములాను అవ‌లంభిస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన‌లో నాయ‌కులు ఏమీ మాట్లాడొద్ద‌ని కొన్నాళ్ల కింద‌ట తిరుమ‌ల‌, తిరుప‌తి వివాదాలు వ‌చ్చిన‌ప్పుడు పార్టీ ఒక లైన్ గీసింది. అయితే.. నాయ‌కులు అప్ప‌టి నుంచి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇలా.. రాష్ట్రంలో సీనియ‌ర్లుగా ఉన్న నాయ‌కులు.. మౌన‌మే నీభాష అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

This post was last modified on July 26, 2025 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago