Political News

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న దర్శనమే పరమావధిగా ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు… తిరుమలలో ఎంతో భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉంటారు. అందులో భాగంగా మద్యం, మాంసం, ధూమపానం ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సాగే భక్తులు… వెంకన్న దర్శనంతో తమ జన్మ ధన్యమైందన్న భావనతో పులకించిపోతారు. ఇలాంటి పరమ పవిత్రమైన కోవెలలో ఇకపై చైనీస్ వంటకాలు కూడా కనిపించవు.

తిరుమల కొండపై చైనీస్ వంటకాలైన ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్ తదితర ఆహార పదార్థాల తయారీ, విక్రయం, భుజించడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిషేధిస్తూ గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం కొండపై కొనసాగుతున్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా హోటళ్లలో పాటించాల్సిన పారిశుద్ధ్యం, భోజనంలో నాణ్యత తదితరాలపై చర్చ జరిగింది. అదే సమయంలో చైనీస్ వంటకాల వాడకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు చౌదరి ప్రకటించారు.

వాస్తవానికి చైనీస్ వంటకాలు రెడీ టూ ఈట్ మాదిరిగా ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే చేతిలో పెడతారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వస్తున్న భక్తులు.. స్థానిక ఆహారం కంటే కూడా చైనీస్ కనబడిందంటే చాలు… అటుగా పరుగులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకులు వెల్లడించగా… చైనీస్ మాటున చాలా మంది వ్యాపారులు మాంసాహారాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాంసాహారం వినియోగమే కాకుండా కనీసం ఆ ప్రస్తావన కూడా తిరుమల కొండపై వినిపించకుండా ఉండేందుకే చైనీస్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.

This post was last modified on May 9, 2025 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

1 hour ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

1 hour ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

2 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

2 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

2 hours ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

2 hours ago