కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న దర్శనమే పరమావధిగా ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు… తిరుమలలో ఎంతో భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉంటారు. అందులో భాగంగా మద్యం, మాంసం, ధూమపానం ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సాగే భక్తులు… వెంకన్న దర్శనంతో తమ జన్మ ధన్యమైందన్న భావనతో పులకించిపోతారు. ఇలాంటి పరమ పవిత్రమైన కోవెలలో ఇకపై చైనీస్ వంటకాలు కూడా కనిపించవు.
తిరుమల కొండపై చైనీస్ వంటకాలైన ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్ తదితర ఆహార పదార్థాల తయారీ, విక్రయం, భుజించడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిషేధిస్తూ గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం కొండపై కొనసాగుతున్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా హోటళ్లలో పాటించాల్సిన పారిశుద్ధ్యం, భోజనంలో నాణ్యత తదితరాలపై చర్చ జరిగింది. అదే సమయంలో చైనీస్ వంటకాల వాడకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు చౌదరి ప్రకటించారు.
వాస్తవానికి చైనీస్ వంటకాలు రెడీ టూ ఈట్ మాదిరిగా ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే చేతిలో పెడతారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వస్తున్న భక్తులు.. స్థానిక ఆహారం కంటే కూడా చైనీస్ కనబడిందంటే చాలు… అటుగా పరుగులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకులు వెల్లడించగా… చైనీస్ మాటున చాలా మంది వ్యాపారులు మాంసాహారాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాంసాహారం వినియోగమే కాకుండా కనీసం ఆ ప్రస్తావన కూడా తిరుమల కొండపై వినిపించకుండా ఉండేందుకే చైనీస్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.
This post was last modified on May 9, 2025 2:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…