Political News

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు ప్రబల నిదర్శనాలు కనిపించాయి. పహల్ గాం ఉగ్ర దాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలనే భారత్ టార్గెట్ చేసింది. అంతేకాకుండా తాము ఇప్పటిదాకా పాక్ పౌర సమాజాన్ని గానీ, ఆ దేశ సైనిక స్థావరాలను టార్గెట్ చేసి గానీ దాడులే చేయలేదని కూడా భారత సైన్యం అధికారికంగానే ప్రకటించింది. అయితే పాక్ ఈ వ్యవహారంలో దొంగ దారిని అవలంబించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైపోయింది.

భారత్ లోని పటిష్ట ఎయిర్ బేస్ కలిగిన పఠాన్ కోట్ ను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం వైమానిక దాడికి దిగింది. అయితే ఈ తరహా దాడులను ముందే పసిగట్టిన భారత్… పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాధాన్యం, దానిపై గతంలో జరిగిన దాడులను గుర్తు చేసుకుని మరీ భారత్ అక్కడ పటిష్ట భద్రతా వ్యవస్థను రంగంలోకి దించింది. పఠాన్ కోట్ వైపు దూసుకువచ్చిన పాక్ ఫైటర్ జెట్ విమానాన్ని భారత్ కూల్చేసింది. ఈ ఘటనలో పాక్ జెట్ లోని ఆ దేశ పైలట్ కూడా భారత్ కు పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

అదే సమయంలో భారత్ సరిహద్దు వెంట ఉన్న పలు కీలక పోస్టులు అయిన సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పుర, ఆర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లను పాక్ ప్రయోగించింది. వీటిని కూడా భారత్ గాల్లోనే పేల్చి పారేసింది. తాను చేసిన దాడులు విఫలమైన నేపథ్యంలో పాక్ తన సిసలైన దొంగ బుద్దిని బయటపెట్టుకుంది. తాము భారత్ పై ఇప్పటిదాకా ఎలాంటి దాడులే చేయలేదని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి వంటి ప్రాంతాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థను బారత్ ధ్వంసం చేసింది.

ఇదిలా ఉంటే…భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలను పరిశీలిస్తూ వస్తున్న అగ్రరాజ్యం అమెరికా… గురువారం నాటి పరిస్థితులను తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రుబియో పాక్, భారత్ లకు ఫోన్లు చేశారు. పాక్ ప్రధానితో మాట్లాడిన రుబియో…యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలని సూచించారు. అదే సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోనూ ఆయన మాట్లాడారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని రుబియో నొక్కి చెప్పారు.

This post was last modified on May 8, 2025 11:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

2 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

2 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

2 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

10 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

11 hours ago