పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి. అదే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు బలి అయిన అమాయకుల కుటుంబాలు మాత్రం ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పహల్ గాం ఉగ్ర దాడిలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మధుసూదన్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ ను ఆయన సతీమణి కామాక్షి కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన ఈ సైనిక దాడులపై తాజాగా కామాక్షి స్పందించారు. వాస్తవానికి తన కల్లెదుటే భర్తను కోల్పోయిన కామాక్షి మాట్లాడే పరిస్తితిలో కూడా లేరనే చెప్పాలి. అయినా కూడా ఆమె స్పందించడం గమనార్హం.
పహల్ గాం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా మన దేశ సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట వైమానిక దాడులు చేసిన వైనం తమకు సంతోషాన్ని కలిగించిందని కామాక్షి తెలిపారు. ఈ దాడులు తన భర్తతో పాటు బాధిత 26 కుటుంబాల తరఫున ప్రతీకారం తీర్చుకున్నట్లేనని ఆమె అన్నారు. తమ ప్రతీకారాన్ని భుజాన వేసుకుని ఆపరేషన్ సిందూర్ జరిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ మోదీజీ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ అంటే… భర్తలను కోల్పోయిన తమ లాంటి బాధితుల జరిపిన దాడులే ఇవని కామాక్షి అన్నారు. ఆపరేషన్ సిందూర్ దెబ్బతో మరోమారు భారత్ పై దాడులు చేయాలంటేనే ఉగ్రవాదులు భయపడే పరిస్థితిని మోదీ తీసుకువచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం మధుసూదన్ కుమారుడు కూడా మీడియాతో మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ గురించి టీవీల్లో చూశానని, ఈ దాడులతో ఇకపై పెహల్ గాం లాంటి దాడులు జరగవనే అనుకుంటున్నానని అతడు పేర్కొన్నాడు.
This post was last modified on May 7, 2025 8:14 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…