Political News

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి. అదే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు బలి అయిన అమాయకుల కుటుంబాలు మాత్రం ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

పహల్ గాం ఉగ్ర దాడిలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మధుసూదన్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ ను ఆయన సతీమణి కామాక్షి కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన ఈ సైనిక దాడులపై తాజాగా కామాక్షి స్పందించారు. వాస్తవానికి తన కల్లెదుటే భర్తను కోల్పోయిన కామాక్షి మాట్లాడే పరిస్తితిలో కూడా లేరనే చెప్పాలి. అయినా కూడా ఆమె స్పందించడం గమనార్హం. 

పహల్ గాం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా మన దేశ సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట వైమానిక దాడులు చేసిన వైనం తమకు సంతోషాన్ని కలిగించిందని కామాక్షి తెలిపారు. ఈ దాడులు తన భర్తతో పాటు బాధిత 26 కుటుంబాల తరఫున ప్రతీకారం తీర్చుకున్నట్లేనని ఆమె అన్నారు. తమ ప్రతీకారాన్ని భుజాన వేసుకుని ఆపరేషన్ సిందూర్ జరిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ మోదీజీ అని ఆమె వ్యాఖ్యానించారు. 

ఆపరేషన్ సిందూర్ అంటే… భర్తలను కోల్పోయిన తమ లాంటి బాధితుల జరిపిన దాడులే ఇవని కామాక్షి అన్నారు. ఆపరేషన్ సిందూర్ దెబ్బతో మరోమారు భారత్ పై దాడులు చేయాలంటేనే ఉగ్రవాదులు భయపడే పరిస్థితిని మోదీ తీసుకువచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం మధుసూదన్ కుమారుడు కూడా మీడియాతో మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ గురించి టీవీల్లో చూశానని, ఈ దాడులతో ఇకపై పెహల్ గాం లాంటి దాడులు జరగవనే అనుకుంటున్నానని అతడు పేర్కొన్నాడు.

This post was last modified on May 7, 2025 8:14 pm

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

4 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

11 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

12 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

13 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

17 hours ago