ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి తనను తాను డిఫెండ్ చేసుకోవాలన్నా ఓర్పు-సహనం అత్యంత కీలకం. పహల్గామ్లో జరిగిన దాడి అనంతరం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత నెల 22న జరిగిన దాడి అనంతరం.. ఒకటి రెండు రోజుల్లోనే భారత్ పాక్కు బుద్ధి చెప్పాలని.. చెబుతుందని కూడా అందరూ అనుకున్నారు.
కానీ, ప్రధాన మంత్రి అలా చేయలేదు. దీంతో కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ కూడా.. ఇంకా మీన మేషాలు లెక్కిస్తారా? అంటూ నిట్టూర్పు వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి కూడా మోడీపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు కూడా దిగింది. అయితే.. వీటన్నింటినీ పంటి బిగువున భరించిన మోడీ.. గత నెల 22 నుంచి నిన్నటి వరకు(మే 6) ప్రపంచ దేశాలను మన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.
ఫలితంగా.. నాటి మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఎలా అయితే సృష్టించారో.. ఇప్పుడు కూడా మోడీ అదే వ్యూహంతో ముందుకు సాగారు. విమర్శలు వచ్చినా.. వాటిపై స్పందించకుండా.. వివేచనతో ముందుకు సాగారు. అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఫస్ట్ విజయం దక్కింది. ఆ తర్వాత.. సాయుధ సంపత్తిని పెంచుకున్నారు. మరోవైపు.. దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా మానసికంగా సిద్ధం చేశారు. ఇదేసమయంలో భారత్ శాంతి కాముక దేశమని.. ఉత్తుత్తునే ఆగ్రహానికి గురి కాదన్న సందేశం ఇచ్చారు.
అంతేకాదు.. భారత్ ఆగ్రహిస్తే.. మేం కూడా ఏమీ చేయలేమన్న భావనను ప్రపంచ దేశాల నుంచి పాక్కు బలంగా వినిపించేలా చేశారు మోడీ. అనంతరం.. అస్త్ర శస్త్రాలతో తొలి విడత పాక్కు దిమ్మదిరిగేలా.. నోట మాట కూడా రాని విధంగా పద్మవ్యూహంలో పాక్ను ఉంచి ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి బిగించారు. ఈ పరిణామాల వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగింది. పైకి మోడీ మెత్తని వాడు.. అని అనుకున్నా.. తాజా పరిణామం తర్వాత.. ప్రపంచ దేశాలన్నీ.. మోడీ శభాష్ అని అంటున్నాయి. దటీజ్ భారత్ సత్తా! అని మన వాళ్లు పండగ చేసుకుంటున్నారు.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…