సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు.. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, అప్పటి గనుల శాఖ అధికారి, ఆయన బావమరిది.. ఏవీ శ్రీనివాసులు సహా పలువురికి సీబీఐ కోర్టు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వారిని వెంటనే జైలుకు కూడా తరలించారు. అయితే.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. గతంలో తెలంగాణ హైకోర్టు తప్పించిన.. మరో నిందితురాలు.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
“ఈ కేసులో ఆమె ప్రమేయం ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయి. నాడు(వైఎస్ హయాం) ఆమె మైనింగ్ శాఖ కార్యదర్శి హోదాలో సంతకాలు చేశారు. కాబట్టి.. ఆమె ప్రమేయం లేదని గుడ్డిగా నమ్మి అలా వదిలేయడానికి కుదరదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్ను సవాల్ చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గతంలో హైకోర్టు శ్రీలక్ష్మికి.. ఈ కేసుతో సంబంధం లేదంటూ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు.. తక్షణమే మరోసారి ఆమెపై వచ్చిన అభియోగాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశించింది. ఈ విచారణను 3 మాసాల్లో పూర్తి చేసి.. తమకు నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. గతంలో శ్రీలక్ష్మి.. తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. ఇది విధానపరమైన నిర్ణయమని.. తాను ఓ అధికారిగా సంతకాలు మాత్రమే చేశానని హైకోర్టులో వాదనలు వినిపించారు. తనను కేసు నుంచి తప్పించాలని వేడుకున్నారు.
దీంతో హైకోర్టు పూర్వాపరాలు పరిశీలించి.. ఆమెను ఈ కేసు నుంచి తప్పించింది. అయితే.. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెలువడి.. శ్రీలక్ష్మి ఊపిరి పీల్చుకున్న మర్నాడే సుప్రీంకోర్టు బాంబు పేల్చడం గమనార్హం. దీంతో ఇప్పుడు మరోసారి శ్రీలక్ష్మి.. పాత్ర, ఆమె వెనుక ఎవరున్నారు? ఆమె చేసిన సంతకాలు వంటి కీలక విషయాలపై ఆది నుంచి విచారణ ప్రారంభం కానుంది.
This post was last modified on May 7, 2025 3:25 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…