Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌: ప‌వ‌న్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌పై ఉగ్ర‌మూక‌లు దాడులు చేసి.. కులం అడిగి మ‌రీ హ‌తమార్చిన దారుణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆల‌స్య‌మైనా ఉగ్ర‌మూక‌ల‌పై బెబ్బులి లా విరుచుకుప‌డింది. పాక్ గడ్డ‌పై ఉన్న ఉగ్రమూక‌ల స్తావ‌రాల‌ను.. వారి ఆన‌వాళ్ల‌ను తునాతున‌క‌లు చేసింది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ పేరుతో చేప‌ట్టిన ఈ దాడికి యావ‌త్ భార‌తావ‌నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా ఉగ్ర‌వాద దాడుల‌ను తీవ్రంగా ఖండించ‌డంతో పాటు.. ప‌హ‌ల్గామ్ దాడుల్లో మృతి చెందిన వారి ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేసిన జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సిందూర్ ఆప‌రేష‌న్ పై స్పందించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌.. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలు. స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేయ‌డం.. స‌రైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో అనేక మంది తోబుట్టువులు.. త‌మ ‘సిందూరాల‌ను’ పోగొట్టుకున్నార‌ని.. దీనికి ప్ర‌తీ కారంగా ఉగ్ర‌వాదుల‌పై ఎప్పుడు క‌సి తీర్చుకుంటామా? అని యావ‌త్ భార‌త దేశం ఎదురు చూసిందన్నారు. ఇప్ప‌టికి వారి ఆశల‌ను ప్ర‌ధాని మోడీ నెర‌వేర్చార‌ని తెలిపారు. మోడీ నేతృత్వంలో భార‌త సైన్యం విజృంభించి.. పాక్ ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ది చెప్పింద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేసినా తామంతా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పారు.

ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. మ‌తం పేరు అడిగి మ‌రీ చంపేశార‌ని.. ఇంత దారుణం ఎప్పుడు విన‌లేద‌న్నారు. ఆఖ‌రి ఉగ్ర‌వాదిని అంతం చేసే వ‌ర‌కు.. మోడీ పోరాటం ఆప‌బోర‌ని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవా రు.. ఎవ‌రైనా త‌మ విధానం మార్చుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. భార‌త సైన్యంపై ఎవ‌రూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని.. అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 7, 2025 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

1 hour ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

1 hour ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

1 hour ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

4 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

6 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

9 hours ago