Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌: ప‌వ‌న్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌పై ఉగ్ర‌మూక‌లు దాడులు చేసి.. కులం అడిగి మ‌రీ హ‌తమార్చిన దారుణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆల‌స్య‌మైనా ఉగ్ర‌మూక‌ల‌పై బెబ్బులి లా విరుచుకుప‌డింది. పాక్ గడ్డ‌పై ఉన్న ఉగ్రమూక‌ల స్తావ‌రాల‌ను.. వారి ఆన‌వాళ్ల‌ను తునాతున‌క‌లు చేసింది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ పేరుతో చేప‌ట్టిన ఈ దాడికి యావ‌త్ భార‌తావ‌నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా ఉగ్ర‌వాద దాడుల‌ను తీవ్రంగా ఖండించ‌డంతో పాటు.. ప‌హ‌ల్గామ్ దాడుల్లో మృతి చెందిన వారి ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేసిన జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సిందూర్ ఆప‌రేష‌న్ పై స్పందించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌.. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలు. స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేయ‌డం.. స‌రైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో అనేక మంది తోబుట్టువులు.. త‌మ ‘సిందూరాల‌ను’ పోగొట్టుకున్నార‌ని.. దీనికి ప్ర‌తీ కారంగా ఉగ్ర‌వాదుల‌పై ఎప్పుడు క‌సి తీర్చుకుంటామా? అని యావ‌త్ భార‌త దేశం ఎదురు చూసిందన్నారు. ఇప్ప‌టికి వారి ఆశల‌ను ప్ర‌ధాని మోడీ నెర‌వేర్చార‌ని తెలిపారు. మోడీ నేతృత్వంలో భార‌త సైన్యం విజృంభించి.. పాక్ ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ది చెప్పింద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేసినా తామంతా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పారు.

ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. మ‌తం పేరు అడిగి మ‌రీ చంపేశార‌ని.. ఇంత దారుణం ఎప్పుడు విన‌లేద‌న్నారు. ఆఖ‌రి ఉగ్ర‌వాదిని అంతం చేసే వ‌ర‌కు.. మోడీ పోరాటం ఆప‌బోర‌ని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవా రు.. ఎవ‌రైనా త‌మ విధానం మార్చుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. భార‌త సైన్యంపై ఎవ‌రూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని.. అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

4 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago