Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌: ప‌వ‌న్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌పై ఉగ్ర‌మూక‌లు దాడులు చేసి.. కులం అడిగి మ‌రీ హ‌తమార్చిన దారుణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆల‌స్య‌మైనా ఉగ్ర‌మూక‌ల‌పై బెబ్బులి లా విరుచుకుప‌డింది. పాక్ గడ్డ‌పై ఉన్న ఉగ్రమూక‌ల స్తావ‌రాల‌ను.. వారి ఆన‌వాళ్ల‌ను తునాతున‌క‌లు చేసింది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ పేరుతో చేప‌ట్టిన ఈ దాడికి యావ‌త్ భార‌తావ‌నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా ఉగ్ర‌వాద దాడుల‌ను తీవ్రంగా ఖండించ‌డంతో పాటు.. ప‌హ‌ల్గామ్ దాడుల్లో మృతి చెందిన వారి ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేసిన జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సిందూర్ ఆప‌రేష‌న్ పై స్పందించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌.. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలు. స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేయ‌డం.. స‌రైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో అనేక మంది తోబుట్టువులు.. త‌మ ‘సిందూరాల‌ను’ పోగొట్టుకున్నార‌ని.. దీనికి ప్ర‌తీ కారంగా ఉగ్ర‌వాదుల‌పై ఎప్పుడు క‌సి తీర్చుకుంటామా? అని యావ‌త్ భార‌త దేశం ఎదురు చూసిందన్నారు. ఇప్ప‌టికి వారి ఆశల‌ను ప్ర‌ధాని మోడీ నెర‌వేర్చార‌ని తెలిపారు. మోడీ నేతృత్వంలో భార‌త సైన్యం విజృంభించి.. పాక్ ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ది చెప్పింద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేసినా తామంతా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పారు.

ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. మ‌తం పేరు అడిగి మ‌రీ చంపేశార‌ని.. ఇంత దారుణం ఎప్పుడు విన‌లేద‌న్నారు. ఆఖ‌రి ఉగ్ర‌వాదిని అంతం చేసే వ‌ర‌కు.. మోడీ పోరాటం ఆప‌బోర‌ని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవా రు.. ఎవ‌రైనా త‌మ విధానం మార్చుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. భార‌త సైన్యంపై ఎవ‌రూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని.. అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 7, 2025 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

6 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

8 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

9 hours ago

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…

10 hours ago

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…

11 hours ago

వంద బరువులు మోస్తున్న నాగార్జున

అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…

12 hours ago