Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌: ప‌వ‌న్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌పై ఉగ్ర‌మూక‌లు దాడులు చేసి.. కులం అడిగి మ‌రీ హ‌తమార్చిన దారుణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆల‌స్య‌మైనా ఉగ్ర‌మూక‌ల‌పై బెబ్బులి లా విరుచుకుప‌డింది. పాక్ గడ్డ‌పై ఉన్న ఉగ్రమూక‌ల స్తావ‌రాల‌ను.. వారి ఆన‌వాళ్ల‌ను తునాతున‌క‌లు చేసింది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ పేరుతో చేప‌ట్టిన ఈ దాడికి యావ‌త్ భార‌తావ‌నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా ఉగ్ర‌వాద దాడుల‌ను తీవ్రంగా ఖండించ‌డంతో పాటు.. ప‌హ‌ల్గామ్ దాడుల్లో మృతి చెందిన వారి ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేసిన జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సిందూర్ ఆప‌రేష‌న్ పై స్పందించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌.. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలు. స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేయ‌డం.. స‌రైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో అనేక మంది తోబుట్టువులు.. త‌మ ‘సిందూరాల‌ను’ పోగొట్టుకున్నార‌ని.. దీనికి ప్ర‌తీ కారంగా ఉగ్ర‌వాదుల‌పై ఎప్పుడు క‌సి తీర్చుకుంటామా? అని యావ‌త్ భార‌త దేశం ఎదురు చూసిందన్నారు. ఇప్ప‌టికి వారి ఆశల‌ను ప్ర‌ధాని మోడీ నెర‌వేర్చార‌ని తెలిపారు. మోడీ నేతృత్వంలో భార‌త సైన్యం విజృంభించి.. పాక్ ఉగ్ర‌వాదుల‌కు త‌గిన విధంగా బుద్ది చెప్పింద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేసినా తామంతా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పారు.

ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. మ‌తం పేరు అడిగి మ‌రీ చంపేశార‌ని.. ఇంత దారుణం ఎప్పుడు విన‌లేద‌న్నారు. ఆఖ‌రి ఉగ్ర‌వాదిని అంతం చేసే వ‌ర‌కు.. మోడీ పోరాటం ఆప‌బోర‌ని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవా రు.. ఎవ‌రైనా త‌మ విధానం మార్చుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. భార‌త సైన్యంపై ఎవ‌రూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని.. అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 7, 2025 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

3 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago