Political News

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్ర‌మంలో ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా విచారించిన .. నాటి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్‌.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఉర‌ఫ్ జేడీ లక్ష్మీనారాయ‌ణ తాజాగా నాటి అనుభ‌వాల‌ను.. కేసు విచార‌ణ‌కు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను ఓ మీడియా సంస్థ‌తో పంచుకున్నారు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా తమ‌కు దొర‌క‌లేద‌ని వివ‌రించారు. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌కుండా.. అనేక వ్య‌వ‌స్థ‌లు త‌మ‌పై ఒత్తిడి పెంచాయ‌న్నారు.

“అస‌లు కేసు న‌మోదైన త‌ర్వాత‌..ఎటు నుంచి విచార‌ణ‌ను ప్రారంభించాల‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. దీనిని ఛేదించేందుకు స‌మ‌యం ప‌ట్టింది. పైగా కొన్ని కీల‌క వ్య‌వ‌స్థ‌లు.. ఆయ‌న వెన‌కే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ఎలా విచార‌ణ ప్రారంభించాలో కూడా మాకు అర్థం కాలేదు” అని జేడీ వివ‌రించారు. మైనింగ్ కేసు రెండు రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉంద‌ని.. దీంతో అటు వైపు అధికారులు, ఇటు వైపు అధికారులు కూడా స‌హ‌క‌రించాల‌ని, కానీ, ఈ విష‌యంలో అధికారులు స‌హ‌క‌రించ‌డం త‌ల‌కు మించిన ప‌నిగా మారింద‌న్నారు. కీల‌క అధికారులు తాము విచార‌ణ‌కు వ‌స్తున్నామ‌ని తెలిసి సెల‌వుల‌పై వెళ్లిపోయేవారని చెప్పారు.

‘సీబీఐ అధికారుల‌మ‌ని చెబితే.. గాలి జ‌నార్దన్‌రెడ్డి మ‌నుషులు త‌మ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని భావించాం. అందుకే.. ఐటీ అధికారుల‌మ‌ని చెప్పి.. కేవ‌లం త‌నిఖీల కోస‌మ‌ని చెప్పి వెళ్లి ఆయ‌న‌ను అరెస్టు చేశాం. అంతేకాదు.. ఆయ‌న అరెస్టు అయ్యార‌న్న వార్త‌ను అత్యంత గోప్యంగా ఉంచాం.ఈ విష‌యంలో ఎన్నో ఇబ్బందులు కూడా ప‌డ్డాం. మా ఫోన్ల‌ను ప‌క్క‌న పెట్టేశాం. అరెస్టు త‌ర్వాత‌.. మాకు బెదిరింపులు వ‌స్తాయ‌ని కొంద‌రు అన్నారు. కానీ.. ప‌క్కా ఆధారాల‌తో కేసును ఫైల్ చేశాం” అని వివ‌రించారు.

అంతేకాదు.. ఈ కేసు విచార‌ణ‌ను ఆల‌స్యం చేసేందుకు ప్ర‌య‌త్నం సాగాయ‌ని జేడీ వివ‌రించారు. త‌మ చేతిలోని అధికారుల‌ను బ‌దిలీ చేయించేవార‌ని.. దీంతో ఈ రోజు ఉన్న అధికారి రేపు ఉంటాడో ఉండ‌డో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొన్నామ‌ని జేడీ వివ‌రించారు. ఇక‌, ఇలాంటి కేసులు విచారించేవారు.. స‌హ‌జంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు త‌న‌పైనా ప్ర‌భావం చూపించాయ‌న్నారు. ఇంత జాప్యం(14 సంవ‌త్స‌రాలు) జ‌ర‌గ‌డానికి రాజ‌కీయ ప‌ర‌మైన బ‌దిలీలు కార‌ణ‌మై ఉంటాయ‌న్నారు. కానీ, ఇలాంటి కేసులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on May 7, 2025 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

7 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

9 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

12 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

13 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

14 hours ago