Political News

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్ర‌మంలో ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా విచారించిన .. నాటి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్‌.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఉర‌ఫ్ జేడీ లక్ష్మీనారాయ‌ణ తాజాగా నాటి అనుభ‌వాల‌ను.. కేసు విచార‌ణ‌కు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను ఓ మీడియా సంస్థ‌తో పంచుకున్నారు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా తమ‌కు దొర‌క‌లేద‌ని వివ‌రించారు. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌కుండా.. అనేక వ్య‌వ‌స్థ‌లు త‌మ‌పై ఒత్తిడి పెంచాయ‌న్నారు.

“అస‌లు కేసు న‌మోదైన త‌ర్వాత‌..ఎటు నుంచి విచార‌ణ‌ను ప్రారంభించాల‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. దీనిని ఛేదించేందుకు స‌మ‌యం ప‌ట్టింది. పైగా కొన్ని కీల‌క వ్య‌వ‌స్థ‌లు.. ఆయ‌న వెన‌కే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ఎలా విచార‌ణ ప్రారంభించాలో కూడా మాకు అర్థం కాలేదు” అని జేడీ వివ‌రించారు. మైనింగ్ కేసు రెండు రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉంద‌ని.. దీంతో అటు వైపు అధికారులు, ఇటు వైపు అధికారులు కూడా స‌హ‌క‌రించాల‌ని, కానీ, ఈ విష‌యంలో అధికారులు స‌హ‌క‌రించ‌డం త‌ల‌కు మించిన ప‌నిగా మారింద‌న్నారు. కీల‌క అధికారులు తాము విచార‌ణ‌కు వ‌స్తున్నామ‌ని తెలిసి సెల‌వుల‌పై వెళ్లిపోయేవారని చెప్పారు.

‘సీబీఐ అధికారుల‌మ‌ని చెబితే.. గాలి జ‌నార్దన్‌రెడ్డి మ‌నుషులు త‌మ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని భావించాం. అందుకే.. ఐటీ అధికారుల‌మ‌ని చెప్పి.. కేవ‌లం త‌నిఖీల కోస‌మ‌ని చెప్పి వెళ్లి ఆయ‌న‌ను అరెస్టు చేశాం. అంతేకాదు.. ఆయ‌న అరెస్టు అయ్యార‌న్న వార్త‌ను అత్యంత గోప్యంగా ఉంచాం.ఈ విష‌యంలో ఎన్నో ఇబ్బందులు కూడా ప‌డ్డాం. మా ఫోన్ల‌ను ప‌క్క‌న పెట్టేశాం. అరెస్టు త‌ర్వాత‌.. మాకు బెదిరింపులు వ‌స్తాయ‌ని కొంద‌రు అన్నారు. కానీ.. ప‌క్కా ఆధారాల‌తో కేసును ఫైల్ చేశాం” అని వివ‌రించారు.

అంతేకాదు.. ఈ కేసు విచార‌ణ‌ను ఆల‌స్యం చేసేందుకు ప్ర‌య‌త్నం సాగాయ‌ని జేడీ వివ‌రించారు. త‌మ చేతిలోని అధికారుల‌ను బ‌దిలీ చేయించేవార‌ని.. దీంతో ఈ రోజు ఉన్న అధికారి రేపు ఉంటాడో ఉండ‌డో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొన్నామ‌ని జేడీ వివ‌రించారు. ఇక‌, ఇలాంటి కేసులు విచారించేవారు.. స‌హ‌జంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు త‌న‌పైనా ప్ర‌భావం చూపించాయ‌న్నారు. ఇంత జాప్యం(14 సంవ‌త్స‌రాలు) జ‌ర‌గ‌డానికి రాజ‌కీయ ప‌ర‌మైన బ‌దిలీలు కార‌ణ‌మై ఉంటాయ‌న్నారు. కానీ, ఇలాంటి కేసులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on May 7, 2025 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

2 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

2 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

3 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

5 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

5 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

6 hours ago