Political News

నిమ్మగడ్డ కి పోలింగ్ సిబ్బంది ట్విస్ట్

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు లేదంటు ఏపిఎన్జీవో నేతలు స్పష్టంగా చెప్పారు. కరోనా కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు రాష్ట్రంలో లేవని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహించాలంటే ముందు భారం పడేది పోలింగ్ సిబ్బందిపైనే అన్న విషయాన్ని నేతలు గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు ఉద్యోగులు ఎవరు ముందుకు రావటం లేదన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ తమ అభ్యంతరాలను కాదని ఎన్నికల నిర్వహణకే నిమ్మగడ్డ మొగ్గుచూపితే తాము కోర్టును ఆశ్రయిస్తామని కూడా నేతలు హెచ్చరించారు. అయితే, వీరే ఈ మాటలు చెప్పారా? లేక వీరి చేత ఎవరైనా ఈ మాటలు చెప్పించారా అన్న చర్చకూడా జరుగుతోంది. ఎందుకంటే ఇపుడు సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారు. ఇతర విధుల్లో ఉంటే రాని కరోనా ఎన్నికల విధుల వల్లే వస్తుందా? అన్నది మౌలిక ప్రశ్న.

ఇదిలా ఉంటే వారు తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేలమంది ఉద్యోగులు కరోనా వైరస్ భారిన పడిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. లాక్ డౌన్ లో భాగంగా విధినిర్వహణలో సుమారు 11 వేల మంది పోలీసులు కరోనా వైరస్ భారిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ భారిన పడ్డారని చెప్పారు. పోలీసులు+ ఉద్యోగుల్లో కొన్ని వందలమంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఎన్నికల కారణంగా కరోనా భారిన పడటానికి తమ ఉద్యోగుల్లో ఎవరు ఇష్టపడటం లేదన్నారు.

ముఖ్యంగా రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఎన్నికల విధులంటేనే భయపడుతున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు, ఉద్యోగులు లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని సూచించారు. పదవిలోనుండి దిగిపోయేలోగా ఎన్నికలను నిర్వహించేయాలన్న పంతానికి నిమ్మగడ్డ వెళితే తాము కూడా కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. వ్యవహారం చూస్తుంటే ఎన్నికల నిర్వహణపై ఏపిఎన్జీవోలు కోర్టులో కేసు వేసేట్లే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే నిమ్మగడ్డ చెప్పేశారు కాబట్టి. మరి ఉద్యోగులెవరు ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని చెప్పిన విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on November 5, 2020 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago