Political News

నిమ్మగడ్డ కి పోలింగ్ సిబ్బంది ట్విస్ట్

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు లేదంటు ఏపిఎన్జీవో నేతలు స్పష్టంగా చెప్పారు. కరోనా కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు రాష్ట్రంలో లేవని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహించాలంటే ముందు భారం పడేది పోలింగ్ సిబ్బందిపైనే అన్న విషయాన్ని నేతలు గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు ఉద్యోగులు ఎవరు ముందుకు రావటం లేదన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ తమ అభ్యంతరాలను కాదని ఎన్నికల నిర్వహణకే నిమ్మగడ్డ మొగ్గుచూపితే తాము కోర్టును ఆశ్రయిస్తామని కూడా నేతలు హెచ్చరించారు. అయితే, వీరే ఈ మాటలు చెప్పారా? లేక వీరి చేత ఎవరైనా ఈ మాటలు చెప్పించారా అన్న చర్చకూడా జరుగుతోంది. ఎందుకంటే ఇపుడు సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారు. ఇతర విధుల్లో ఉంటే రాని కరోనా ఎన్నికల విధుల వల్లే వస్తుందా? అన్నది మౌలిక ప్రశ్న.

ఇదిలా ఉంటే వారు తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేలమంది ఉద్యోగులు కరోనా వైరస్ భారిన పడిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. లాక్ డౌన్ లో భాగంగా విధినిర్వహణలో సుమారు 11 వేల మంది పోలీసులు కరోనా వైరస్ భారిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ భారిన పడ్డారని చెప్పారు. పోలీసులు+ ఉద్యోగుల్లో కొన్ని వందలమంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఎన్నికల కారణంగా కరోనా భారిన పడటానికి తమ ఉద్యోగుల్లో ఎవరు ఇష్టపడటం లేదన్నారు.

ముఖ్యంగా రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఎన్నికల విధులంటేనే భయపడుతున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు, ఉద్యోగులు లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని సూచించారు. పదవిలోనుండి దిగిపోయేలోగా ఎన్నికలను నిర్వహించేయాలన్న పంతానికి నిమ్మగడ్డ వెళితే తాము కూడా కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. వ్యవహారం చూస్తుంటే ఎన్నికల నిర్వహణపై ఏపిఎన్జీవోలు కోర్టులో కేసు వేసేట్లే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే నిమ్మగడ్డ చెప్పేశారు కాబట్టి. మరి ఉద్యోగులెవరు ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని చెప్పిన విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on November 5, 2020 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టార్లు లేని లోటు… సత్య తీరుస్తాడా?

ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…

2 hours ago

హిట్టిస్తే గుడి కట్టేస్తారు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కొట్టి దశాబ్దం…

2 hours ago

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

5 hours ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

7 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

7 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

8 hours ago