తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పార్టీ పెట్టిన తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు.. చాలానే ప్రత్యేకతలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానంగా సాధారణ స్తాయి కాకుండా.. ఈ దఫా అసాధారణ స్థాయిలో మహానాడును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో 3 రకాల ప్రత్యేకతలు ఉంటాయ న్నారు.
1) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించడం: ఈ విధానంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావును ఏఐ ద్వారా సభకు ఆహ్వానిస్తారు. తద్వారా ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి.. మహానాడు ప్రాంగణంలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తారు. అంతేకాదు.. మహానాడును ఉద్దేశించి అన్నగారు ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
2) చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ను మూడు రోజులు మూడు భాగాలుగా ప్రదర్శించడం: ఇది పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సీనియర్ నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం చంద్రబాబు తొలినాళ్లలో మలినాళ్లలో ఎలా కష్టపడ్డారో.. షార్ట్ ఫిల్మ్ల ఆధారంగా ప్రదర్శస్తారు. తద్వారా.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు.
3) ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం: ఇప్పటి వరకు డిజిటల్ టీడీపీని అంటే ఐటీడీపీని మాత్రమే పరిచయం చేశారు. ఇక, నుంచి ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన కీలక కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఏఐతో నాయకుల పనితీరు, కార్యకర్తల పనితీరును అంచనా వేస్తారు. ఇది సమగ్రంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయనుందని చెబుతున్నారు.
This post was last modified on May 5, 2025 6:27 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…