తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పార్టీ పెట్టిన తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు.. చాలానే ప్రత్యేకతలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానంగా సాధారణ స్తాయి కాకుండా.. ఈ దఫా అసాధారణ స్థాయిలో మహానాడును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో 3 రకాల ప్రత్యేకతలు ఉంటాయ న్నారు.
1) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించడం: ఈ విధానంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావును ఏఐ ద్వారా సభకు ఆహ్వానిస్తారు. తద్వారా ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి.. మహానాడు ప్రాంగణంలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తారు. అంతేకాదు.. మహానాడును ఉద్దేశించి అన్నగారు ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
2) చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ను మూడు రోజులు మూడు భాగాలుగా ప్రదర్శించడం: ఇది పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సీనియర్ నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం చంద్రబాబు తొలినాళ్లలో మలినాళ్లలో ఎలా కష్టపడ్డారో.. షార్ట్ ఫిల్మ్ల ఆధారంగా ప్రదర్శస్తారు. తద్వారా.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు.
3) ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం: ఇప్పటి వరకు డిజిటల్ టీడీపీని అంటే ఐటీడీపీని మాత్రమే పరిచయం చేశారు. ఇక, నుంచి ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన కీలక కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఏఐతో నాయకుల పనితీరు, కార్యకర్తల పనితీరును అంచనా వేస్తారు. ఇది సమగ్రంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయనుందని చెబుతున్నారు.
This post was last modified on May 5, 2025 6:27 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…