Political News

తాట‌తీస్తా.. బాల‌య్య మాస్

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ పాలిటిక్స్‌తో అద‌ర‌గొట్టారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న వ‌రుస‌గా రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు. స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో క‌లిసి వ‌చ్చి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప‌లుకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇటీవ‌ల ప‌ద్మ‌భూష‌ణ్ స‌త్కారం కూడా పొంద‌డంతో బాల‌య్య అభిమానులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆయ‌న‌కు ఘ‌న స‌త్కారం చేశారు. సోమ‌వారంఉద‌యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన బాల‌య్య కొన్ని చోట్ల స‌భ‌ల్లోనూ ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కుల‌కు ఆయ‌న మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయ‌ల సీమ ను త‌న అడ్డాగా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఇక్క‌డ వైసీపీ ఆగడాలు సాగ‌బోవ‌ని వెల్ల‌డించారు. దోచుకుని.. దాచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే.. తాట‌తీస్తా అంటూ వైసీపీ నాయ‌కుల‌కు మాస్ హెచ్చ‌రిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను ప్ర‌స్తావిస్తూ.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం.. నియోజ‌క‌వ‌ర్గంలో హిందూపురం మండలంలో ల‌బ్ధిదారులైన‌ ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు అన్ని వేళ‌లా అందుబాటులో ఉంటున్నామ‌ని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే రాజ‌ధాని అమ‌రావ‌తి పూర్త‌వుతుంద‌ని చెప్పారు. తాను నియోజ‌క‌వ‌ర్గం లో ఉండ‌డం లేద‌ని అంటున్న‌వారికి మైండ్ ప‌నిచేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ప‌నులు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు.

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ పాలిటిక్స్‌తో అద‌ర‌గొట్టారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న వ‌రుస‌గా రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు. స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో క‌లిసి వ‌చ్చి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప‌లుకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇటీవ‌ల ప‌ద్మ‌భూష‌ణ్ స‌త్కారం కూడా పొంద‌డంతో బాల‌య్య అభిమానులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆయ‌న‌కు ఘ‌న స‌త్కారం చేశారు. సోమ‌వారం ఉద‌యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన బాల‌య్య కొన్ని చోట్ల స‌భ‌ల్లోనూ ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కుల‌కు ఆయ‌న మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయ‌లసీమను త‌న అడ్డాగా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఇక్క‌డ వైసీపీ ఆగడాలు సాగ‌బోవ‌ని వెల్ల‌డించారు. ‘దోచుకుని.. దాచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే.. తాట‌తీస్తా’ అంటూ వైసీపీ నాయ‌కుల‌కు మాస్ హెచ్చ‌రిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను ప్ర‌స్తావిస్తూ.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం.. నియోజ‌క‌వ‌ర్గంలో హిందూపురం మండలంలో ల‌బ్ధిదారులైన‌ ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు అన్ని వేళ‌లా అందుబాటులో ఉంటున్నామ‌ని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే రాజ‌ధాని అమ‌రావ‌తి పూర్త‌వుతుంద‌ని చెప్పారు. తాను నియోజ‌క‌వ‌ర్గం లో ఉండ‌డం లేద‌ని అంటున్న‌వారికి మైండ్ ప‌నిచేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ప‌నులు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు.

This post was last modified on May 5, 2025 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago