టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పద్మభూషణ్ సత్కారం కూడా పొందడంతో బాలయ్య అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన సత్కారం చేశారు. సోమవారంఉదయం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కొన్ని చోట్ల సభల్లోనూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయల సీమ ను తన అడ్డాగా ప్రకటించిన ఆయన.. ఇక్కడ వైసీపీ ఆగడాలు సాగబోవని వెల్లడించారు. దోచుకుని.. దాచుకునేందుకు ప్రయత్నిస్తే.. తాటతీస్తా అంటూ వైసీపీ నాయకులకు మాస్ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నాయకులపై వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే.. ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం.. నియోజకవర్గంలో హిందూపురం మండలంలో లబ్ధిదారులైన ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయన ఆధ్వర్యంలోనే రాజధాని అమరావతి పూర్తవుతుందని చెప్పారు. తాను నియోజకవర్గం లో ఉండడం లేదని అంటున్నవారికి మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పద్మభూషణ్ సత్కారం కూడా పొందడంతో బాలయ్య అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన సత్కారం చేశారు. సోమవారం ఉదయం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కొన్ని చోట్ల సభల్లోనూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమను తన అడ్డాగా ప్రకటించిన ఆయన.. ఇక్కడ వైసీపీ ఆగడాలు సాగబోవని వెల్లడించారు. ‘దోచుకుని.. దాచుకునేందుకు ప్రయత్నిస్తే.. తాటతీస్తా’ అంటూ వైసీపీ నాయకులకు మాస్ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నాయకులపై వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే.. ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం.. నియోజకవర్గంలో హిందూపురం మండలంలో లబ్ధిదారులైన ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయన ఆధ్వర్యంలోనే రాజధాని అమరావతి పూర్తవుతుందని చెప్పారు. తాను నియోజకవర్గం లో ఉండడం లేదని అంటున్నవారికి మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
This post was last modified on May 5, 2025 5:09 pm
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…