ఏపీలో మద్యం కేసు వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. మాజీ సీఎం జగన్కు సన్నిహితులు, ఆయన దగ్గర పీఏలుగా పనిచేసిన వారిని విచారించేందుకు రెడీ అయింది. దీంతో పలువురు తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వాస్తవానికి వారిని ఇంకా విచారణకు పిలవలేదు. కానీ, రాజ్ కసిరెడ్డి ఉదంతం నేపథ్యంలో వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు.
వీరిలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. వీరికి సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. పైగా ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి.. పోలీసు విచారణను ఎదుర్కొన్న రాజ్ కసిరెడ్డి ఈ ముగ్గరి పేర్లను పోలీసులకు చెప్పారు. దీంతో అప్పటి నుంచే వీరికి ఒణుకు ప్రారంభమైంది. దీంతో తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కానీ, వీరికి ఉపశమనం దక్కలేదు. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం జరిగిన విచారణలో ఈ ముగ్గురి విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు.. పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఎలానూ హైకోర్టులో పిటిషన్లు వేశారు కాబట్టి.. అక్కడే తేల్చుకోవాలని సూచించింది. అక్కడ ఏమైనా సానుకూల తీర్పు రాకపోతే.. అప్పుడు తాము విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
అయితే.. ఈ లోగా తమను అరెస్టు చేయకుండా చూడాలన్న ముగ్గురి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తే.. తాము బాధ్యులము కాదని.. అలాగని ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on May 5, 2025 5:28 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…