Political News

జ‌గ‌న్ స‌న్నిహితుల‌పై సుప్రీం కొర‌డా!

ఏపీలో మ‌ద్యం కేసు వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. మాజీ సీఎం జ‌గ‌న్‌కు సన్నిహితులు, ఆయ‌న ద‌గ్గ‌ర పీఏలుగా ప‌నిచేసిన వారిని విచారించేందుకు రెడీ అయింది. దీంతో ప‌లువురు త‌మ‌ను ఎక్క‌డ అరెస్టు చేస్తారో అన్న ఉద్దేశంతో ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. వాస్త‌వానికి వారిని ఇంకా విచార‌ణ‌కు పిల‌వలేదు. కానీ, రాజ్ క‌సిరెడ్డి ఉదంతం నేప‌థ్యంలో వారు ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

వీరిలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. వీరికి సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. పైగా ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్ట‌యి.. పోలీసు విచార‌ణ‌ను ఎదుర్కొన్న రాజ్ క‌సిరెడ్డి ఈ ముగ్గ‌రి పేర్ల‌ను పోలీసుల‌కు చెప్పారు. దీంతో అప్ప‌టి నుంచే వీరికి ఒణుకు ప్రారంభ‌మైంది. దీంతో తొలుత హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ, వీరికి ఉప‌శ‌మ‌నం ద‌క్క‌లేదు. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో ఈ ముగ్గురి విష‌యంపై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. వీరికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. అంతేకాదు.. పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించింది. ఎలానూ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు కాబ‌ట్టి.. అక్క‌డే తేల్చుకోవాల‌ని సూచించింది. అక్క‌డ ఏమైనా సానుకూల తీర్పు రాక‌పోతే.. అప్పుడు తాము విచార‌ణ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే.. ఈ లోగా త‌మ‌ను అరెస్టు చేయ‌కుండా చూడాల‌న్న ముగ్గురి విజ్ఞ‌ప్తిని కూడా సుప్రీంకోర్టు తిర‌స్కరించింది. అరెస్టు చేస్తే.. తాము బాధ్యుల‌ము కాద‌ని.. అలాగ‌ని ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని తాజాగా వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on May 5, 2025 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago