Political News

అఫిషియ‌ల్ : ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండు రోజుల కింద‌టే అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించారు. రాజ‌ధాని ప‌నుల‌కు పునః ప్రారంభం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌ధాని రాక‌కు సంబంధించిన అధికారిక స‌మాచారం.. రాష్ట్రానికి చేరింది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య సెక్ర‌ట‌రీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అదేస‌మ‌యంలో విశాఖప‌ట్నం క‌లెక్ట‌ర్‌కు కూడా.. ఆదివారం సాయంత్రం లేఖ రాశారు. ‘ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి’ అని ఆయ‌న పేర్కొన్నారు. కాగా.. ప్ర‌ధాని వ‌చ్చే నెల జూన్ 21న మ‌రోసారి రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఇది కూడా సీఎం చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభం సంద‌ర్భంగా.. సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధానిని యోగా దినోత్స‌వానికి పిలిచారు. ఆయ న అప్పుడు దాదాపు ఓకే చెప్పారు. అయితే.. యోగా కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి తీసుకువ‌చ్చిన నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కూడా కేంద్రం దీనిని నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రాక‌పై సందేహాలు ఉన్నాయి. అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో ప్ర‌ధాని అమ‌రావ‌తి నుంచి ఢిల్లీ వెళ్లిన రెండో రోజే.. ఏపీకి జూన్ 21, యోగా దినోత్స‌వానికి వ‌స్తున్న‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ప్ర‌ధాని ఎంచుకున్న జిల్లా విశాఖ‌ప‌ట్నం కావ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో యోగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది. అమ‌రావ‌తి పేరును మ‌రింత ప్ర‌చారం చేసుకునేందుకు.. అంద‌రి దృష్టి ప‌డేలా చేసేందుకు సీఎం చంద్ర‌బాబు.. అమ‌రావ‌తిలోనే యోగా చేప‌డితే బెట‌ర్ అని అనుకుంటున్నారు. కానీ.. తాజాగా ప్ర‌ధాని మాత్రం విశాఖ‌ను ఎంచుకున్నారు. దీంతో ఇటీవ‌లే వంద సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ప్ర‌ఖ్యాత విశ్వ‌విద్యాల‌యం.. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో రాష్ట్రం ప‌క్షాన అధికారికంగా యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని.. ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యించింది. ప్ర‌ధాని మోడీ కూడా అక్క‌డ‌కే వ‌స్తున్న నేప‌థ్యంలో ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం వేదిక‌గా.. యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మొత్తానికి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న మ‌రోసారి ఖ‌రారు కావ‌డం ప‌ట్ల కూట‌మి నాయ‌కులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

This post was last modified on May 4, 2025 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

47 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago