ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రధాని రాకకు సంబంధించిన అధికారిక సమాచారం.. రాష్ట్రానికి చేరింది. ప్రధాన మంత్రి కార్యాలయ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేసమయంలో విశాఖపట్నం కలెక్టర్కు కూడా.. ఆదివారం సాయంత్రం లేఖ రాశారు. ‘ప్రధాని వస్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ప్రధాని వచ్చే నెల జూన్ 21న మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇది కూడా సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకే కావడం గమనార్హం.
ఇటీవల అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా.. సీఎం చంద్రబాబు.. ప్రధానిని యోగా దినోత్సవానికి పిలిచారు. ఆయ న అప్పుడు దాదాపు ఓకే చెప్పారు. అయితే.. యోగా కు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్రం దీనిని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాకపై సందేహాలు ఉన్నాయి. అయితే.. ఏమనుకున్నారో.. ఏమో ప్రధాని అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లిన రెండో రోజే.. ఏపీకి జూన్ 21, యోగా దినోత్సవానికి వస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేయడం గమనార్హం. అయితే.. ప్రధాని ఎంచుకున్న జిల్లా విశాఖపట్నం కావడం గమనార్హం.
వాస్తవానికి సీఎం చంద్రబాబు అమరావతిలో యోగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అమరావతి పేరును మరింత ప్రచారం చేసుకునేందుకు.. అందరి దృష్టి పడేలా చేసేందుకు సీఎం చంద్రబాబు.. అమరావతిలోనే యోగా చేపడితే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ.. తాజాగా ప్రధాని మాత్రం విశాఖను ఎంచుకున్నారు. దీంతో ఇటీవలే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయం.. ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రం పక్షాన అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని.. ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రధాని మోడీ కూడా అక్కడకే వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా.. యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాని పర్యటన మరోసారి ఖరారు కావడం పట్ల కూటమి నాయకులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
This post was last modified on May 4, 2025 9:08 pm
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…