Political News

అఫిషియ‌ల్ : ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండు రోజుల కింద‌టే అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించారు. రాజ‌ధాని ప‌నుల‌కు పునః ప్రారంభం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌ధాని రాక‌కు సంబంధించిన అధికారిక స‌మాచారం.. రాష్ట్రానికి చేరింది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య సెక్ర‌ట‌రీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అదేస‌మ‌యంలో విశాఖప‌ట్నం క‌లెక్ట‌ర్‌కు కూడా.. ఆదివారం సాయంత్రం లేఖ రాశారు. ‘ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి’ అని ఆయ‌న పేర్కొన్నారు. కాగా.. ప్ర‌ధాని వ‌చ్చే నెల జూన్ 21న మ‌రోసారి రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఇది కూడా సీఎం చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభం సంద‌ర్భంగా.. సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధానిని యోగా దినోత్స‌వానికి పిలిచారు. ఆయ న అప్పుడు దాదాపు ఓకే చెప్పారు. అయితే.. యోగా కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి తీసుకువ‌చ్చిన నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కూడా కేంద్రం దీనిని నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రాక‌పై సందేహాలు ఉన్నాయి. అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో ప్ర‌ధాని అమ‌రావ‌తి నుంచి ఢిల్లీ వెళ్లిన రెండో రోజే.. ఏపీకి జూన్ 21, యోగా దినోత్స‌వానికి వ‌స్తున్న‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ప్ర‌ధాని ఎంచుకున్న జిల్లా విశాఖ‌ప‌ట్నం కావ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో యోగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది. అమ‌రావ‌తి పేరును మ‌రింత ప్ర‌చారం చేసుకునేందుకు.. అంద‌రి దృష్టి ప‌డేలా చేసేందుకు సీఎం చంద్ర‌బాబు.. అమ‌రావ‌తిలోనే యోగా చేప‌డితే బెట‌ర్ అని అనుకుంటున్నారు. కానీ.. తాజాగా ప్ర‌ధాని మాత్రం విశాఖ‌ను ఎంచుకున్నారు. దీంతో ఇటీవ‌లే వంద సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ప్ర‌ఖ్యాత విశ్వ‌విద్యాల‌యం.. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో రాష్ట్రం ప‌క్షాన అధికారికంగా యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని.. ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యించింది. ప్ర‌ధాని మోడీ కూడా అక్క‌డ‌కే వ‌స్తున్న నేప‌థ్యంలో ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం వేదిక‌గా.. యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మొత్తానికి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న మ‌రోసారి ఖ‌రారు కావ‌డం ప‌ట్ల కూట‌మి నాయ‌కులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

This post was last modified on May 4, 2025 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

35 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

54 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago