Political News

గుట్టు విప్పేస్తున్నారు.. ఇక‌, క‌ష్ట‌మే జ‌గ‌న్..!

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్తు. రాజ‌కీయ ప‌రిష్వంగాన్ని వ‌దిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో నేరాలు ఎవ‌రు చేశారు? ఎవ‌రు చేయించారు? అన్న ప్ర‌శ్న‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలియ‌దు-గుర్తులేదు-మ‌రిచిపోయాం.. అన్న వారే.. ఇప్పుడు నిజాలు కక్కేస్తున్నారు. కీల‌క‌మైన రెండు కార‌ణాల‌తో గుట్టు బ‌య‌ట పెట్టేస్తున్నారు. ఈ ప‌రిణామం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఉచ్చు బిగిసేలా చేస్తోంది.

ముఖ్యంగా మ‌ద్యం కుంభ‌కోణం, అదేవిధంగా ముంబై న‌టి జెత్వానీ కేసులను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఐపీఎస్‌లు స‌హా.. వైసీపీ సానుభూతి ప‌రులు, గ‌తంలో జ‌గ‌న్‌తో క‌లిసి ముందుకు న‌డిచిన వారుకూడా అరెస్ట‌య్యారు. ప్ర‌స్తుతం విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. అయితే.. తొలుత వీరంతా త‌మ‌కు సంబంధం లేద‌ని.. తాము నిమిత్త‌మాత్రుల‌మ‌ని చెప్పుకొచ్చారు. కానీ, రోజులు, వారాలు, నెల‌లు గ‌డుస్తున్న నేప‌థ్యంలో వారే నోరు విప్పేస్తున్నారు.

దీనికి కార‌ణం జ‌గ‌నేన‌ని తాజాగా క‌సి రెడ్డి రాజ్ చెప్పేశారు. ఇక‌, ఐపీఎస్‌ల వంతు మాత్ర‌మే మిగిలి ఉంది. అంటే.. మ‌ద్యం కుంభ‌కోణంలో అక్ర‌మాలు.. నిధుల మ‌ళ్లింపు.. అంతా కూడా.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే జ‌రిగిపో యింద‌ని రాజ్ చెప్ప‌డంతో దాదాపు కేసు కొలిక్కి వ‌చ్చేసింది. మ‌రోవైపు జ‌త్వానీ కేసులో కూడా నేడో రేపో నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయ‌ని విచార‌ణాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు కూడా జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఇలా ఎందుకు..?
వాస్త‌వానికి కేసుల్లో చిక్కుకున్న‌వారు రెండుర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. 1) తామునిన్న‌టి దాకా ఎవ‌రి మాట అయితే విన్నారో.. ఎవ‌రు చెప్పిన‌ట్టు చేశారో.. వారు ఇప్పుడు త‌మ‌ను వ‌దిలేయ‌డం. 2) తాము నిజాలు చెబితే.. కొంత వ‌ర‌కైనా సేఫ్ కావొచ్చ‌న్న కార‌ణం. ఈ రెండు కార‌ణాల‌తోనే ప్ర‌స్తుతం మ‌ద్యం, జెత్వానీ కేసుల్లో చిక్కుకున్న‌వారు.. నిజాలు చెప్పేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో రెండు రోజుల్లో మరిన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. అది జ‌గ‌న్‌కు మ‌రింత ఉచ్చును బిగిసేలా చేస్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

3 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

5 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago