Political News

గుట్టు విప్పేస్తున్నారు.. ఇక‌, క‌ష్ట‌మే జ‌గ‌న్..!

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్తు. రాజ‌కీయ ప‌రిష్వంగాన్ని వ‌దిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో నేరాలు ఎవ‌రు చేశారు? ఎవ‌రు చేయించారు? అన్న ప్ర‌శ్న‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలియ‌దు-గుర్తులేదు-మ‌రిచిపోయాం.. అన్న వారే.. ఇప్పుడు నిజాలు కక్కేస్తున్నారు. కీల‌క‌మైన రెండు కార‌ణాల‌తో గుట్టు బ‌య‌ట పెట్టేస్తున్నారు. ఈ ప‌రిణామం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఉచ్చు బిగిసేలా చేస్తోంది.

ముఖ్యంగా మ‌ద్యం కుంభ‌కోణం, అదేవిధంగా ముంబై న‌టి జెత్వానీ కేసులను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఐపీఎస్‌లు స‌హా.. వైసీపీ సానుభూతి ప‌రులు, గ‌తంలో జ‌గ‌న్‌తో క‌లిసి ముందుకు న‌డిచిన వారుకూడా అరెస్ట‌య్యారు. ప్ర‌స్తుతం విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. అయితే.. తొలుత వీరంతా త‌మ‌కు సంబంధం లేద‌ని.. తాము నిమిత్త‌మాత్రుల‌మ‌ని చెప్పుకొచ్చారు. కానీ, రోజులు, వారాలు, నెల‌లు గ‌డుస్తున్న నేప‌థ్యంలో వారే నోరు విప్పేస్తున్నారు.

దీనికి కార‌ణం జ‌గ‌నేన‌ని తాజాగా క‌సి రెడ్డి రాజ్ చెప్పేశారు. ఇక‌, ఐపీఎస్‌ల వంతు మాత్ర‌మే మిగిలి ఉంది. అంటే.. మ‌ద్యం కుంభ‌కోణంలో అక్ర‌మాలు.. నిధుల మ‌ళ్లింపు.. అంతా కూడా.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే జ‌రిగిపో యింద‌ని రాజ్ చెప్ప‌డంతో దాదాపు కేసు కొలిక్కి వ‌చ్చేసింది. మ‌రోవైపు జ‌త్వానీ కేసులో కూడా నేడో రేపో నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయ‌ని విచార‌ణాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు కూడా జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఇలా ఎందుకు..?
వాస్త‌వానికి కేసుల్లో చిక్కుకున్న‌వారు రెండుర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. 1) తామునిన్న‌టి దాకా ఎవ‌రి మాట అయితే విన్నారో.. ఎవ‌రు చెప్పిన‌ట్టు చేశారో.. వారు ఇప్పుడు త‌మ‌ను వ‌దిలేయ‌డం. 2) తాము నిజాలు చెబితే.. కొంత వ‌ర‌కైనా సేఫ్ కావొచ్చ‌న్న కార‌ణం. ఈ రెండు కార‌ణాల‌తోనే ప్ర‌స్తుతం మ‌ద్యం, జెత్వానీ కేసుల్లో చిక్కుకున్న‌వారు.. నిజాలు చెప్పేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో రెండు రోజుల్లో మరిన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. అది జ‌గ‌న్‌కు మ‌రింత ఉచ్చును బిగిసేలా చేస్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 4, 2025 8:04 pm

Share

Recent Posts

భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…

6 minutes ago

తండ్రికే ఎదురు తిరిగిన జోగి రాజీవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎంత‌గా రెచ్చిపోయారో…

10 minutes ago

అయ్యగారి ఫ్యాన్.. కరెక్ట్ గా వాడుకున్నారు కానీ..

'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…

56 minutes ago

అంగన్వాడీ టీచర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్?

ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన…

1 hour ago

విద్యార్థుల పోరాటానికి దిగివచ్చిన మరో ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో…

1 hour ago

గ్యాప్ వచ్చినా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…

5 hours ago