Political News

గుట్టు విప్పేస్తున్నారు.. ఇక‌, క‌ష్ట‌మే జ‌గ‌న్..!

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్తు. రాజ‌కీయ ప‌రిష్వంగాన్ని వ‌దిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో నేరాలు ఎవ‌రు చేశారు? ఎవ‌రు చేయించారు? అన్న ప్ర‌శ్న‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలియ‌దు-గుర్తులేదు-మ‌రిచిపోయాం.. అన్న వారే.. ఇప్పుడు నిజాలు కక్కేస్తున్నారు. కీల‌క‌మైన రెండు కార‌ణాల‌తో గుట్టు బ‌య‌ట పెట్టేస్తున్నారు. ఈ ప‌రిణామం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఉచ్చు బిగిసేలా చేస్తోంది.

ముఖ్యంగా మ‌ద్యం కుంభ‌కోణం, అదేవిధంగా ముంబై న‌టి జెత్వానీ కేసులను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఐపీఎస్‌లు స‌హా.. వైసీపీ సానుభూతి ప‌రులు, గ‌తంలో జ‌గ‌న్‌తో క‌లిసి ముందుకు న‌డిచిన వారుకూడా అరెస్ట‌య్యారు. ప్ర‌స్తుతం విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. అయితే.. తొలుత వీరంతా త‌మ‌కు సంబంధం లేద‌ని.. తాము నిమిత్త‌మాత్రుల‌మ‌ని చెప్పుకొచ్చారు. కానీ, రోజులు, వారాలు, నెల‌లు గ‌డుస్తున్న నేప‌థ్యంలో వారే నోరు విప్పేస్తున్నారు.

దీనికి కార‌ణం జ‌గ‌నేన‌ని తాజాగా క‌సి రెడ్డి రాజ్ చెప్పేశారు. ఇక‌, ఐపీఎస్‌ల వంతు మాత్ర‌మే మిగిలి ఉంది. అంటే.. మ‌ద్యం కుంభ‌కోణంలో అక్ర‌మాలు.. నిధుల మ‌ళ్లింపు.. అంతా కూడా.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే జ‌రిగిపో యింద‌ని రాజ్ చెప్ప‌డంతో దాదాపు కేసు కొలిక్కి వ‌చ్చేసింది. మ‌రోవైపు జ‌త్వానీ కేసులో కూడా నేడో రేపో నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయ‌ని విచార‌ణాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు కూడా జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఇలా ఎందుకు..?
వాస్త‌వానికి కేసుల్లో చిక్కుకున్న‌వారు రెండుర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. 1) తామునిన్న‌టి దాకా ఎవ‌రి మాట అయితే విన్నారో.. ఎవ‌రు చెప్పిన‌ట్టు చేశారో.. వారు ఇప్పుడు త‌మ‌ను వ‌దిలేయ‌డం. 2) తాము నిజాలు చెబితే.. కొంత వ‌ర‌కైనా సేఫ్ కావొచ్చ‌న్న కార‌ణం. ఈ రెండు కార‌ణాల‌తోనే ప్ర‌స్తుతం మ‌ద్యం, జెత్వానీ కేసుల్లో చిక్కుకున్న‌వారు.. నిజాలు చెప్పేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో రెండు రోజుల్లో మరిన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. అది జ‌గ‌న్‌కు మ‌రింత ఉచ్చును బిగిసేలా చేస్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 4, 2025 8:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 minute ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago