ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. సహజంగా చంద్రబాబు.. లేదా.. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అమరావ తిలో కూర్చుని తాజాగా ప్రధాని ప్రారంభించిన పనులను ప్రారంభించేయొచ్చు. ఎందుకంటే.. అమరావతి పనులు ఇప్పుడు కొత్తగా చేపడుతున్నవి కాదు. కాబట్టి.. వారు ఇంతకన్నా అట్టహాసంగా సభ నిర్వహించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలను పూర్తి చేయొచ్చు.
కానీ, జాతీయస్థాయిలో రాజధాని కార్యక్రమాల ప్రారంభం కానీ.. రాజధాని విశిష్టత కానీ.. ప్రొజెక్టు అవుతుందా? అంటే.. అది అత్యంత స్వల్పంగానే ఉంటుంది. రాష్ట్ర మీడియా ప్రొజెక్టు చేసినంతగా.. జాతీయ మీడియా ప్రొజెక్టు చేయదు. అదే ప్రధాని ద్వారా అయితే.. ఆ స్టయిలే వేరు..ఆ ప్రొజెక్షనే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. చాలా మంది చంద్రబాబు.. మళ్లీ ప్రధానిని పిలుస్తున్నారని తెలియగానే విమర్శలు రువ్వారు. ఇప్పుడు ఎందుకు.. గతంలో నే ఆయన ప్రారంభించారు కదా! అని పెదవి విరుపులు కనిపించాయి.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల అయితే.. పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. అయినా.. చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా ప్రధాని రాకకు ప్రాధాన్యం ఇచ్చారు. రెండు నుంచి మూడు సార్లు… ప్రత్యేకంగా ఈ పనిమీదనే ఢిల్లీకి వెళ్లి.. ప్రధానిని ఆహ్వానించారు. తద్వారా.. ఆయన ఓ యజ్ఞం పూర్తి చేశారు. దీని తాలూకు ఫలితం.. శనివారం నాటి జాతీయ మీడియా పతాక శీర్షికల్లో అమరావతిని ప్రొజెక్టు చేసింది. ప్రధాని ప్రారంభించిన పనులతో పాటు.. రాజధాని ప్రాముఖ్యతను కూడా విసదీకరిస్తూ.. స్టోరీలు చేసింది.
చంద్రబాబు కోరుకున్నది ఇదే. కేవలం రాష్ట్రంలోనే చర్చ పెట్డడం కాదు.. జాతీయస్థాయిలో రాజధాని పై చర్చ వస్తే.. అది తనకు మాత్రమే కాకుండా పెట్టుబడులు వచ్చేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి పేరు వచ్చేందుకు అవకాశం ఉంటుందని యోచించారు. పట్టు సడలకుండా.. ప్రధానిని ఒప్పించారు. సహజంగా రెండోసారి ఇలా ప్రారంభించేందుకు మోడీ ఇష్టపడకపోయినా.. ఆయనను ఒప్పించారు. తద్వారా.. చంద్రబాబు అమరావతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లడంలోను…చర్చ సాగేలా చేయడంలోనూ.. సంపూర్ణంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
This post was last modified on May 3, 2025 4:05 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…