పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. నాయకుల్లో మార్పు వస్తుంది. అప్పటి వరకు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే దర్పం, అధికారం వంటివి సహజంగానే నాయకులను పెద్దలను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వచ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు. గత ఎన్నికల్లో విజయం నగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న అప్పలనాయుడు.. తన కంటూ ఓ ప్రత్యేకతను సంతరిం చుకున్నారు.
ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రభుత్వం కారు ఏర్పాటు చేసినా.. చాలా సార్లు.. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి పార్లమెంటుకు సైకిల్పైనే వెళ్లిన విషయం తెలిసిందే. ఇదేదో ఒక్కసారికి కాదు.. ఫొటోలు.. వీడియోల కోసం కాదు. పక్కాగా తన సింప్లిసిటీని వ్యక్తం చేసేందుకు కలిశెట్టి అనేక సందర్భాల్లో సైకిల్ పై వచ్చి.. పార్లమెంటుకు వెళ్లారు. ఆయన తన విధేయతను సొంత నియోజకవర్గంలోనూ చూపిస్తున్నారు. ప్రజలను కలుసుకునేందుకు అప్పల నాయకుడు వెళ్లాల్సి వస్తె సైకిల్పైనే వెళ్తున్నారు.
తాజాగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అయివుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు సభ్యుడి హోదాకు తోడు టీడీపీకి విధేయుడైన నాయకుడిగా, కార్యకర్తగా, సీఎం చంద్రబాబు కు అత్యంత ఆప్తుడైన కలిశెట్టి అప్పల నాయుడు కూడా.. వచ్చారు. అయితే, ఆయన అందరిలా కార్లలోనో.. ఇతర ప్రభుత్వ వాహనాల్లోనో రావొచ్చు. కానీ.. అలా రాకుండా గతంలో మాదిరిగా తన సొంత సైకిల్ పై 20 కిలో మీటర్ల మేర తొక్కుకుంటూ.. రాజధాని సభకు హాజరయ్యారు. ఈ పరిణామం .. టీడీపీ నే కాదు. ఇతర పార్టీల నాయకులను కూడా ముగ్ధులను చేయడం విశేషం.
This post was last modified on May 2, 2025 5:45 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…