Political News

మ‌ళ్లీ సైకిలేసుకుని వ‌చ్చేసిన ఎంపీ!

పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నికైన త‌ర్వాత‌.. నాయ‌కుల్లో మార్పు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే ద‌ర్పం, అధికారం వంటివి స‌హ‌జంగానే నాయ‌కుల‌ను పెద్ద‌ల‌ను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వ‌చ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం న‌గ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న అప్ప‌ల‌నాయుడు.. త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రిం చుకున్నారు.

ఆయ‌న పార్ల‌మెంటుకు వెళ్లేందుకు ప్ర‌భుత్వం కారు ఏర్పాటు చేసినా.. చాలా సార్లు.. ఢిల్లీలోని ఆయ‌న నివాసం నుంచి పార్ల‌మెంటుకు సైకిల్‌పైనే వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇదేదో ఒక్క‌సారికి కాదు.. ఫొటోలు.. వీడియోల కోసం కాదు. ప‌క్కాగా త‌న సింప్లిసిటీని వ్య‌క్తం చేసేందుకు క‌లిశెట్టి అనేక సంద‌ర్భాల్లో సైకిల్ పై వ‌చ్చి.. పార్ల‌మెంటుకు వెళ్లారు. ఆయ‌న త‌న విధేయ‌త‌ను సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ చూపిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు అప్ప‌ల నాయ‌కుడు వెళ్లాల్సి వస్తె సైకిల్‌పైనే వెళ్తున్నారు.

తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు పునః ప్రారంభం అయివుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యుడి హోదాకు తోడు టీడీపీకి విధేయుడైన నాయ‌కుడిగా, కార్య‌కర్త‌గా, సీఎం చంద్ర‌బాబు కు అత్యంత ఆప్తుడైన క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు కూడా.. వ‌చ్చారు. అయితే, ఆయ‌న అంద‌రిలా కార్ల‌లోనో.. ఇత‌ర ప్రభుత్వ వాహ‌నాల్లోనో రావొచ్చు. కానీ.. అలా రాకుండా గ‌తంలో మాదిరిగా త‌న సొంత సైకిల్ పై 20 కిలో మీట‌ర్ల మేర తొక్కుకుంటూ.. రాజ‌ధాని స‌భ‌కు హాజ‌రయ్యారు. ఈ ప‌రిణామం .. టీడీపీ నే కాదు. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను కూడా ముగ్ధుల‌ను చేయ‌డం విశేషం.

This post was last modified on May 2, 2025 5:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

12 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago