పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. నాయకుల్లో మార్పు వస్తుంది. అప్పటి వరకు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే దర్పం, అధికారం వంటివి సహజంగానే నాయకులను పెద్దలను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వచ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు. గత ఎన్నికల్లో విజయం నగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న అప్పలనాయుడు.. తన కంటూ ఓ ప్రత్యేకతను సంతరిం చుకున్నారు.
ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రభుత్వం కారు ఏర్పాటు చేసినా.. చాలా సార్లు.. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి పార్లమెంటుకు సైకిల్పైనే వెళ్లిన విషయం తెలిసిందే. ఇదేదో ఒక్కసారికి కాదు.. ఫొటోలు.. వీడియోల కోసం కాదు. పక్కాగా తన సింప్లిసిటీని వ్యక్తం చేసేందుకు కలిశెట్టి అనేక సందర్భాల్లో సైకిల్ పై వచ్చి.. పార్లమెంటుకు వెళ్లారు. ఆయన తన విధేయతను సొంత నియోజకవర్గంలోనూ చూపిస్తున్నారు. ప్రజలను కలుసుకునేందుకు అప్పల నాయకుడు వెళ్లాల్సి వస్తె సైకిల్పైనే వెళ్తున్నారు.
తాజాగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అయివుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు సభ్యుడి హోదాకు తోడు టీడీపీకి విధేయుడైన నాయకుడిగా, కార్యకర్తగా, సీఎం చంద్రబాబు కు అత్యంత ఆప్తుడైన కలిశెట్టి అప్పల నాయుడు కూడా.. వచ్చారు. అయితే, ఆయన అందరిలా కార్లలోనో.. ఇతర ప్రభుత్వ వాహనాల్లోనో రావొచ్చు. కానీ.. అలా రాకుండా గతంలో మాదిరిగా తన సొంత సైకిల్ పై 20 కిలో మీటర్ల మేర తొక్కుకుంటూ.. రాజధాని సభకు హాజరయ్యారు. ఈ పరిణామం .. టీడీపీ నే కాదు. ఇతర పార్టీల నాయకులను కూడా ముగ్ధులను చేయడం విశేషం.
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…