గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీచేసిన ప్రయోగాల గురించి అందరికీ తెలిసిందే. ఒక నియోజకవర్గం నుంచి నాయకులను మరో నియోజకవర్గానికి మార్చేశారు. సదరు నియోజకవర్గం నేతను డమ్మీ చేశారు. ఇక, ఒక జిల్లా నేతను మరో జిల్లాకు మార్చాలని అనుకున్నా.. అది దెబ్బ కొడుతుందని అనుకున్నారు. దీంతో కేవలం నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు కొనసాగాయి. అయితే.. ఈ మార్పులు సక్సెస్ కాకపోగా.. పార్టీ వ్యవస్థీకృతంగా కూడా భారీగా దెబ్బతింది. పనిచేసే నాయకులు కూడా పడకెక్కారు. ఫలితంగా పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది.
కట్ చేస్తే.. ఎన్నికలు జరిగిన తర్వాత.. పది మాసాలకు ఇప్పుడు మరో ప్రయోగం దిశగా వైసీపీ కీలక అడుగులు వేసింది. తాజాగా షఫిలింగ్ రాజకీయాలకు తెరదీసింది. అంటే.. అసలు ఏమాత్రం జిల్లాతో సంబంధం లేని నాయకులను.. అందునా ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న వారిని పొరుగు జిల్లాలకు కేటాయించి.. పార్లమెంటు స్థానాలను అప్పగించింది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నాయకులు ఆ ఏడు నియోజకవర్గాల్లోని నాయకులను సమన్వయం చేసుకుని పార్టీని నిలబెట్టే బాధ్యతలను భుజాలకెత్తుకోవాలి.
కానీ, ఈ తరహా ప్రయోగాలు సక్సెస్ కావని తెలుస్తోంది. ఉదాహరణకు విజయవాడలోనే పట్టు లేని, కార్పొరేటర్ స్థాయి నాయకు డు పూనూరు గౌతం రెడ్డిని ఏకంగా.. బలమైన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలకుడిగా వైసీపీ నియమించింది. నిజానికి పూనూరు మాట విజయవాడలోనే చెల్లుబాటు కాదన్న వాదన ఉంది. అలాంటిది భిన్నమైన రాజకీయాలు.. టీడీపీ వ్యవస్థీకృతంగా ఎంతో బలంగా ఉన్న నరసరావుపేటలో గౌతం రెడ్డి ఏమేరకు పార్టీని పుంజుకునేలా చేస్తారన్నది ఖచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఏం చూసి ఆయనకు ఈ బాధ్యత ఇచ్చారో చూడాలి.
ఇక, గుంటూరుకు చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి బలమైన విజయవాడ పార్లమెంటు స్థానం వైసీపీ పరిశీలకుడిగా నియమించారు. నిజానికి గత ఐదేళ్ల కిందట ఉన్న పరిస్థితిలో మోదుగుల లేరు. యాక్టివ్గా కూడా ఉండలేక పోతున్నారు. కానీ, విజయవాడ రాజకీయాలు మాత్రం హాట్ హాట్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన వచ్చి ఏమేరకు చక్కదిద్దుతారో.. పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్న. ఇక, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వయసు రీత్యా వృద్ధాప్యంలో ఉన్న జంకే వెంకటరెడ్డిని నిత్యం రాజకీయాలు మారుతున్న నెల్లూరులో కేటాయించారు. ఇక్కడ కూటమి ఇప్పుడు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏమేరకు సక్సెస్ అవుతారో అనేది సందేహమే. మరి వైసీపీ చేస్తున్న ఈ షఫిలింగ్ పాలిటిక్స్ మరోసారి వికటిస్తే.. కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 3, 2025 11:41 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…