Political News

వైసీపీ ‘ష‌ఫిలింగ్’ పాలిటిక్స్ స‌క్సెస్ అయ్యేనా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీచేసిన ప్ర‌యోగాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయ‌కుల‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్చేశారు. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నేత‌ను డ‌మ్మీ చేశారు. ఇక‌, ఒక జిల్లా నేత‌ను మ‌రో జిల్లాకు మార్చాల‌ని అనుకున్నా.. అది దెబ్బ కొడుతుంద‌ని అనుకున్నారు. దీంతో కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఈ మార్పులు కొన‌సాగాయి. అయితే.. ఈ మార్పులు స‌క్సెస్ కాక‌పోగా.. పార్టీ వ్య‌వ‌స్థీకృతంగా కూడా భారీగా దెబ్బ‌తింది. ప‌నిచేసే నాయ‌కులు కూడా ప‌డ‌కెక్కారు. ఫ‌లితంగా పార్టీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది.

క‌ట్ చేస్తే.. ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత‌.. ప‌ది మాసాల‌కు ఇప్పుడు మ‌రో ప్ర‌యోగం దిశ‌గా వైసీపీ కీల‌క అడుగులు వేసింది. తాజాగా ష‌ఫిలింగ్ రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. అంటే.. అస‌లు ఏమాత్రం జిల్లాతో సంబంధం లేని నాయ‌కుల‌ను.. అందునా ద్వితీయ శ్రేణి నాయ‌కులుగా ఉన్న వారిని పొరుగు జిల్లాల‌కు కేటాయించి.. పార్ల‌మెంటు స్థానాల‌ను అప్ప‌గించింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నాయ‌కులు ఆ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని పార్టీని నిల‌బెట్టే బాధ్య‌త‌ల‌ను భుజాల‌కెత్తుకోవాలి.

కానీ, ఈ త‌ర‌హా ప్ర‌యోగాలు స‌క్సెస్ కావ‌ని తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌లోనే ప‌ట్టు లేని, కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కు డు పూనూరు గౌతం రెడ్డిని ఏకంగా.. బ‌ల‌మైన న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిశీల‌కుడిగా వైసీపీ నియ‌మించింది. నిజానికి పూనూరు మాట విజ‌య‌వాడ‌లోనే చెల్లుబాటు కాద‌న్న వాద‌న ఉంది. అలాంటిది భిన్న‌మైన రాజ‌కీయాలు.. టీడీపీ వ్య‌వ‌స్థీకృతంగా ఎంతో బ‌లంగా ఉన్న న‌ర‌స‌రావుపేట‌లో గౌతం రెడ్డి ఏమేర‌కు పార్టీని పుంజుకునేలా చేస్తార‌న్నది ఖ‌చ్చితంగా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ఏం చూసి ఆయ‌న‌కు ఈ బాధ్య‌త ఇచ్చారో చూడాలి.

ఇక‌, గుంటూరుకు చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం వైసీపీ ప‌రిశీల‌కుడిగా నియ‌మించారు. నిజానికి గ‌త ఐదేళ్ల కింద‌ట ఉన్న ప‌రిస్థితిలో మోదుగుల లేరు. యాక్టివ్‌గా కూడా ఉండ‌లేక పోతున్నారు. కానీ, విజ‌యవాడ రాజ‌కీయాలు మాత్రం హాట్ హాట్‌గా ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న వ‌చ్చి ఏమేర‌కు చ‌క్క‌దిద్దుతారో.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వ‌య‌సు రీత్యా వృద్ధాప్యంలో ఉన్న జంకే వెంక‌ట‌రెడ్డిని నిత్యం రాజ‌కీయాలు మారుతున్న నెల్లూరులో కేటాయించారు. ఇక్క‌డ కూట‌మి ఇప్పుడు బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో అనేది సందేహ‌మే. మ‌రి వైసీపీ చేస్తున్న ఈ ష‌ఫిలింగ్ పాలిటిక్స్ మ‌రోసారి విక‌టిస్తే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 3, 2025 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

2 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

3 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

6 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

6 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

7 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

7 hours ago