Political News

ప్రైవేట్ రిసార్టులో గ్రూప్ 1 మూల్యాంకనమా..?

గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులను నియమించేందుకు నిర్వహించే పరీక్ష. దేశంలోనే అత్యున్నత స్థాయి అయిన సివిల్ సర్వీసెస్ తర్వాత స్థాయి సర్వీసు ఉద్యోగులు వీరే. వీరే ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అధికారులుగా ప్రమోట్ అవుతారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం (వాల్యూయేషన్) ఎంత పకడ్బందీగా జరగాలి.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉద్యోగార్థులకు ఎలాంటి అనుమానాలు రేకెత్తని రీతిలో ఈ వాల్యూయేషన్ ను చేపట్టాలి. అయితే సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటి… ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా మంచి ట్రాక్ రికార్డు కలిగి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా వ్యవస్థలపైనే అనుమానా రేకెత్తేలా ఆయన నడుచుకున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో విడుదలైన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మెయిన్స్ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఆ సమయంలో కమిషన్ కు చైర్మన్ లేకపోగా… కార్యదర్శి హోడాలో పీఎస్ఆర్ అన్నీతానై వ్యవహరించారు. పరీక్షల నిర్వహణ నుంచి వాల్యూయేషన్ దాకా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ మేరకు ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులే పీఎస్ఆర్ అక్రమాలను , ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.

ఈ వివరాలన్నీ ఇప్పుడు హైకోర్టుకు చేరడంతో పీఎస్ఆర్ మరింత మేర చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన గ్రూప్ 1 జవాబు పత్రాల వాల్యూయేషన్ ను పీఎస్ఆర్ ఏకంగా ఓ ప్రైవేటు రిసార్టులో నిర్వహించడం గమనార్హం.

ఏపీపీఎస్సీ ఓ చట్టబద్ధ సంస్థ. రిసార్టు అనేది డబ్బున్న వాళ్లు చిందులేసి సేదదీరేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ విడిది. ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పీఎస్ఆర్ చెరిపేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య జరగాల్సిన పేపర్ల వాల్యూయేషన్ ను పీఎస్ఆర్..గుంటూరు జిల్లా పరిధిలోని హాయ్ ల్యాండ్ రిసార్టులో నిర్వహించారు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.1.14 కోట్ల ఏపీపీఎస్సీ నిధులను చెల్లించారు. పోనీ… ఈ వాల్యూయేషన్ తోనే సరిపెట్టారా? అంటే… అదీ లేదు.

ఈ వాల్యూయేషన్ ను పక్కనపెట్టేసిన పీఎస్ఆర్ మరోమారు ఆ పత్రాలను దిద్దించారు. అయినా ప్రైవేటు రిసార్టుగా ఉన్న హాయ్ ల్యాండ్ రిసార్టులో గ్రూప్ 1 జవాబు పత్రాల వాల్యూయేషన్ ఏమిటంటూ అభ్యర్థులు పీఎస్ఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ పీఎస్ఆర్ చేసిన నిర్వాకాలను ఆధారాలతో సహా వారు హైకోర్టు ముందు ఉంచడం గమనార్హం.

ప్రస్తుతం ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో పీఎస్ఆర్ అరెస్టై విజయవాడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని మేర ఆధారాలను సేకరించే క్రమంలో పీఎస్ఆర్ ను సీఐడీ అదికారులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కస్టడీ విచారణపైనా పీఎస్ఆర్ నేరుగా న్యాయమూర్తికే ఫిర్యాదు చేసి తనదైన మార్కును చాటుకున్నారు.

మొత్తం 3 రోజుల కస్టడీకి పీఎస్ఆర్ ను సీఐడీకి ఇవ్వగా..మొన్న పీఎస్ఆర్ కు హైబీపీ ఉందని వైద్యులు చెప్పడంతో… పీఎస్ఆర్ కు ఏమీ కాకూడదన్న భావనతో సీఐడీ అదుపులోకి తీసుకోలేదు. దీనిపై మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టుకు వెళ్లిన పీఎస్ఆర్… తాను ఫిట్ గా ఉన్నా కూడా సీఐడీ అదికారులు తనను ఓ రోజు విచారించలేదని జడ్జీకి ఫిర్యాదు చేశారట. మొత్తంగా ఏది చేసినా పీఎస్ఆర్ తన వింత ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారన్నమాట.

This post was last modified on April 30, 2025 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

23 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago