Political News

వైసీపీ పాల‌న‌లో నాణ్య‌త లేని ‘గోడే’ నిలువునా ముంచేసిందా!

సింహాచలంలోని అప్పన్న ఆల‌యం వ‌ద్ద‌ ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా 300 రూపాయ‌ల‌ టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా భ‌క్తుల‌కు గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఘ‌టన విష‌యం తెలియ‌గానే.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. సింహాద్రి అప్ప‌న్న ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి వంగ‌ల‌పూడి అనిత, జిల్లా కలెక్టర్ అక్క‌డ‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని మంత్రి అనిత తెలిపారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపింది. వైసీపీ హ‌యాంలో ఇక్క‌డ గోడ నిర్మించ‌డం.. అది నాణ్య‌త లేద‌ని తాజాగా అధికారులు గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి కేంద్రం అమ‌లు చేస్తున్న ‘ప్రసాదం ప‌థ‌కం’ కింద 2021-22 మ‌ధ్య ఈ గోడ నిర్మించారు. ప్ర‌స్తుతం అక్క‌డ అభివృద్ధి ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే.. తాజాగా జ‌రిగిన గోడ కూలిన ఘ‌ట‌న‌లో నాణ్య‌త లోపాలు బ‌య‌ట‌కు క‌నిపించాయి. సిమెంటు ఇటుక‌ల‌ను వినియోగించి.. ఈ గోడ‌ను నిర్మించారు. అయితే.. ఇటుక‌-ఇటుక మ‌ధ్య సిమెంటు తాప‌డం.. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటుక‌లు పొడి పొడిగా కూడా ఉన్నాయి. దీంతో నాణ్య‌త లోపం స్ప‌ష్టంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఇక‌, బుధ‌వారం తెల్ల‌వారు జాము వ‌ర‌కు కూడా సింహాద్రిపై భారీ వ‌ర్షం కురిసింది. దీంతో గోడ పూర్తిగా నాని.. ఒక్క‌సారిగా కూలిపోయింది. ఆ ప‌క్క నుంచే క్యూ లైన్ ఉండ‌డంతో భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో 8 మంది వ‌ర‌కు భ‌క్తులు మృతి చెందారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.. వైసీపీ హ‌యాంలోనే నాణ్య‌త‌లేని నిర్మాణాలు చేప‌ట్టార‌ని.. అందుకే ఇప్పుడు దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌న్నారు.

This post was last modified on April 30, 2025 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

6 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

6 hours ago