Political News

వైసీపీ పాల‌న‌లో నాణ్య‌త లేని ‘గోడే’ నిలువునా ముంచేసిందా!

సింహాచలంలోని అప్పన్న ఆల‌యం వ‌ద్ద‌ ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా 300 రూపాయ‌ల‌ టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా భ‌క్తుల‌కు గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఘ‌టన విష‌యం తెలియ‌గానే.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. సింహాద్రి అప్ప‌న్న ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి వంగ‌ల‌పూడి అనిత, జిల్లా కలెక్టర్ అక్క‌డ‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని మంత్రి అనిత తెలిపారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపింది. వైసీపీ హ‌యాంలో ఇక్క‌డ గోడ నిర్మించ‌డం.. అది నాణ్య‌త లేద‌ని తాజాగా అధికారులు గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి కేంద్రం అమ‌లు చేస్తున్న ‘ప్రసాదం ప‌థ‌కం’ కింద 2021-22 మ‌ధ్య ఈ గోడ నిర్మించారు. ప్ర‌స్తుతం అక్క‌డ అభివృద్ధి ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే.. తాజాగా జ‌రిగిన గోడ కూలిన ఘ‌ట‌న‌లో నాణ్య‌త లోపాలు బ‌య‌ట‌కు క‌నిపించాయి. సిమెంటు ఇటుక‌ల‌ను వినియోగించి.. ఈ గోడ‌ను నిర్మించారు. అయితే.. ఇటుక‌-ఇటుక మ‌ధ్య సిమెంటు తాప‌డం.. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటుక‌లు పొడి పొడిగా కూడా ఉన్నాయి. దీంతో నాణ్య‌త లోపం స్ప‌ష్టంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఇక‌, బుధ‌వారం తెల్ల‌వారు జాము వ‌ర‌కు కూడా సింహాద్రిపై భారీ వ‌ర్షం కురిసింది. దీంతో గోడ పూర్తిగా నాని.. ఒక్క‌సారిగా కూలిపోయింది. ఆ ప‌క్క నుంచే క్యూ లైన్ ఉండ‌డంతో భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో 8 మంది వ‌ర‌కు భ‌క్తులు మృతి చెందారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.. వైసీపీ హ‌యాంలోనే నాణ్య‌త‌లేని నిర్మాణాలు చేప‌ట్టార‌ని.. అందుకే ఇప్పుడు దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌న్నారు.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago