Political News

రూ. 224 కోట్ల భారీ జరిమానా విధించిన ఈడీ

నిబంధనలను అతిక్రమించి విదేశీ కంపెనీతో వ్యాపారం చేసిన కారణంగా ఓ జ్యువెలరీ కంపెనీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యంత భారీ జరిమానాను విధించింది. మనదేశ చరిత్రలో ఈడీ రూ. 224 కోట్ల అత్యంత బారీ జరిమానా విధించి రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే న్యూఢిల్లీ కేంద్రంగా సుఖేష్ గుప్తా అనే వ్యాపారి ముసద్దీలాల్ జ్యువెలర్స్ పేరుతో వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.

తన వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో విదేశాల్లోని సంస్ధలతో వ్యాపారం చేయాలని అనుకున్నారు. హాంకాంగ్ లోని లింక్ పై అనే సంస్దతో వ్యాపార ఒప్పందాన్ని చేసుకున్నారు గుప్తా. విదేశీ సంస్ధతో వ్యాపార లావాదేవీలు చేయటానికి సుఖేష్ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కొద్ది సంవత్సరాలుగా హాంకాంగ్ కంపెనీతో సుఖేష్ చేసిన అక్రమవ్యాపారం చివరకు బట్టబయలైంది.

తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు జరిపిన దర్యాప్తులో సుఖేష్ చేస్తున్న మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. దాంతో ఒక్కసారా ఎంబిఎస్ సంస్ధపై దాడులు జరిపిన అధికారులు వ్యాపారం మొత్తాన్ని సీజ్ చేసేశారు. తర్వాత అంతర్గతంగా జరిపిన తనిఖీల్లో హాంకాంగ్ సంస్ధతో జరిపిన వ్యాపారం మొత్తం బయటపడింది. ఈడీ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం సుమారు రూ. 100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కనుక్కున్నారు.

విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసేటపుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను సుఖేష్ ఉల్లంఘించిన విషయం ఆధారాలతో సహా నిరూపణయ్యింది. దాంతో రూ. 224 కోట్ల అత్యంత భారీ జరిమానా విధించింది ఈడీ. తనకు పడిన అంత భారీ జరిమానాను సుఖేష్ కట్టగలడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on November 4, 2020 5:57 pm

Share
Show comments
Published by
satya
Tags: ED

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

5 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

5 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

6 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

7 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

8 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

9 hours ago