Political News

రూ. 224 కోట్ల భారీ జరిమానా విధించిన ఈడీ

నిబంధనలను అతిక్రమించి విదేశీ కంపెనీతో వ్యాపారం చేసిన కారణంగా ఓ జ్యువెలరీ కంపెనీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యంత భారీ జరిమానాను విధించింది. మనదేశ చరిత్రలో ఈడీ రూ. 224 కోట్ల అత్యంత బారీ జరిమానా విధించి రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే న్యూఢిల్లీ కేంద్రంగా సుఖేష్ గుప్తా అనే వ్యాపారి ముసద్దీలాల్ జ్యువెలర్స్ పేరుతో వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.

తన వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో విదేశాల్లోని సంస్ధలతో వ్యాపారం చేయాలని అనుకున్నారు. హాంకాంగ్ లోని లింక్ పై అనే సంస్దతో వ్యాపార ఒప్పందాన్ని చేసుకున్నారు గుప్తా. విదేశీ సంస్ధతో వ్యాపార లావాదేవీలు చేయటానికి సుఖేష్ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కొద్ది సంవత్సరాలుగా హాంకాంగ్ కంపెనీతో సుఖేష్ చేసిన అక్రమవ్యాపారం చివరకు బట్టబయలైంది.

తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు జరిపిన దర్యాప్తులో సుఖేష్ చేస్తున్న మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. దాంతో ఒక్కసారా ఎంబిఎస్ సంస్ధపై దాడులు జరిపిన అధికారులు వ్యాపారం మొత్తాన్ని సీజ్ చేసేశారు. తర్వాత అంతర్గతంగా జరిపిన తనిఖీల్లో హాంకాంగ్ సంస్ధతో జరిపిన వ్యాపారం మొత్తం బయటపడింది. ఈడీ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం సుమారు రూ. 100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కనుక్కున్నారు.

విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసేటపుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను సుఖేష్ ఉల్లంఘించిన విషయం ఆధారాలతో సహా నిరూపణయ్యింది. దాంతో రూ. 224 కోట్ల అత్యంత భారీ జరిమానా విధించింది ఈడీ. తనకు పడిన అంత భారీ జరిమానాను సుఖేష్ కట్టగలడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on November 4, 2020 5:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: ED

Recent Posts

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

28 minutes ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

1 hour ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

2 hours ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

6 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా…

7 hours ago