Political News

రూ. 224 కోట్ల భారీ జరిమానా విధించిన ఈడీ

నిబంధనలను అతిక్రమించి విదేశీ కంపెనీతో వ్యాపారం చేసిన కారణంగా ఓ జ్యువెలరీ కంపెనీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యంత భారీ జరిమానాను విధించింది. మనదేశ చరిత్రలో ఈడీ రూ. 224 కోట్ల అత్యంత బారీ జరిమానా విధించి రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే న్యూఢిల్లీ కేంద్రంగా సుఖేష్ గుప్తా అనే వ్యాపారి ముసద్దీలాల్ జ్యువెలర్స్ పేరుతో వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.

తన వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో విదేశాల్లోని సంస్ధలతో వ్యాపారం చేయాలని అనుకున్నారు. హాంకాంగ్ లోని లింక్ పై అనే సంస్దతో వ్యాపార ఒప్పందాన్ని చేసుకున్నారు గుప్తా. విదేశీ సంస్ధతో వ్యాపార లావాదేవీలు చేయటానికి సుఖేష్ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కొద్ది సంవత్సరాలుగా హాంకాంగ్ కంపెనీతో సుఖేష్ చేసిన అక్రమవ్యాపారం చివరకు బట్టబయలైంది.

తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు జరిపిన దర్యాప్తులో సుఖేష్ చేస్తున్న మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. దాంతో ఒక్కసారా ఎంబిఎస్ సంస్ధపై దాడులు జరిపిన అధికారులు వ్యాపారం మొత్తాన్ని సీజ్ చేసేశారు. తర్వాత అంతర్గతంగా జరిపిన తనిఖీల్లో హాంకాంగ్ సంస్ధతో జరిపిన వ్యాపారం మొత్తం బయటపడింది. ఈడీ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం సుమారు రూ. 100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కనుక్కున్నారు.

విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసేటపుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను సుఖేష్ ఉల్లంఘించిన విషయం ఆధారాలతో సహా నిరూపణయ్యింది. దాంతో రూ. 224 కోట్ల అత్యంత భారీ జరిమానా విధించింది ఈడీ. తనకు పడిన అంత భారీ జరిమానాను సుఖేష్ కట్టగలడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on November 4, 2020 5:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: ED

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

15 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

53 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago